‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్కు వచ్చిన ఫాలోయింగ్ అలాంటిలాంటిది కాదు. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ రిలీజైన దగ్గర్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసుకుని తిరిగారు. ‘బాహుబలి-2’తో వాళ్ల ఆనందం పతాక స్థాయికి చేరింది. కానీ ఆ తర్వాత మాత్రం వారికి ఆవేదన తప్పట్లేదు. ‘సాహో’ కోసం సుదీర్ఘ సమయం వేచి చూస్తే పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ మరింతగా వారిని నిరాశకు గురి చేసింది. తమ ఆకాంక్షలకు భిన్నమైన కాంబినేషన్లలో ప్రభాస్ సినిమాలు చేయడం వారికి రుచించలేదు. సాహో, రాధేశ్యామ్ల తర్వాత అయినా తమ అభిప్రాయాల్ని ప్రభాస్ పరిగణనలోకి తీసుకోవాలని వాళ్లు గట్టిగా కోరుతున్నారు.
మారుతితో ప్రభాస్ కొత్త చిత్రం చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి అతడి ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కోసం ప్రభాస్తో జట్టు కట్టబోయే హీరోయిన్ విషయంలో వాళ్లు గోల చేస్తున్నారు.
ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కెల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ అనే మరో భారీ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. కానీ ఈ లోపే కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేసే పనిలో పడ్డాడు సందీప్. ‘స్పిరిట్’కు కథానాయికగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ను ఓకే చేసినట్లుగా రెండు రోజుల కిందట సమాచారం బయటికి వచ్చింది. ఇక అంతే.. అప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రచ్చ మామూలుగా లేదు.
బాలీవుడ్ వాళ్లే ఔట్ డేటెడ్ అని పక్కన పెట్టేసిన హీరోయిన్ని ప్రభాస్కు జోడీగా తీసుకోవడం ఏంటి.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న హీరోయిన్తో ఇంకా పెళ్లి కాని ప్రభాస్ రొమాన్స్ చేయడమేంటి అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రభాస్ లుక్స్ విషయంలో ఈ మధ్య చాలా ట్రోలింగ్ జరిగింది. ఇక కరీనా లాంటి సీనియర్ హీరోయిన్తో అతను జట్టు కడితే ఇద్దరినీ కలిపి ట్రోల్ చేస్తారని.. ట్రెండీ సినిమాలు తీసే సందీప్ రెడ్డి ప్రభాస్కు జోడీగా యంగ్ హీరోయిన్ తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…