ఇంకా పుష్ప 2 ది రూల్ షూటింగ్ మొదలుకాలేదు అప్పుడే దాని కథ గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. అందులో ప్రధానమైనది శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ట్విస్టు. రెండో భాగంలో ఆ పాత్రను చంపేస్తారని, దానికి ప్రతీకారంగా ప్రీ క్లైమాక్స్ నుంచి పుష్ప రాజ్ విశ్వరూపం ఉంటుందని ఇలా ఏదేదో స్టోరీ అల్లేశారు. దాన్ని నిజమని నమ్మేసిన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, రకరకాల మీమ్స్ రావడం జరిగిపోయింది. ఫ్రెష్ గా దానికి సంబంధించిన అనఫీషియల్ లీక్ ఒకటి వచ్చేసింది.
దాని ప్రకారం శ్రీవల్లి క్యారెక్టర్ కు ఎలాంటి సాడ్ ఎండింగ్ ఉండదు. చివరి దాకా బ్రతికే ఉంటుందట. ఒకవేళ అలా చేయకపోతే కెజిఎఫ్ 2తో పాటు ఇంకొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టు అనిపించడమే కాక ఇది రొటీన్ గా ఫీలయ్యే ఛాన్స్ ఉండటంతో దర్శకుడు సుకుమార్ అలాంటి మలుపేదీ ప్లాన్ చేయలేదని తెలిసింది. దానికన్నా ఎక్కువగా హీరో విలన్ క్లాష్ ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఎలా నింపాలనే దాని మీదే తీవ్రమైన డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఫైనల్ కంక్లూజన్ కు వచ్చారో లేదో తెలియదు.
జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు కానీ ఆ సూచనలేమీ కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ కు వెళ్ళిపోయాడు. సుకుమార్ బయట ఈవెంట్లు ఫంక్షన్లలో కనిపిస్తున్నారు కానీ పుష్ప 2 ప్రస్తావన మాత్రం తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నారు. చూస్తుంటే ఆగస్ట్ కంటే ముందే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎలా చూసుకున్నా 2023 వేసవి కన్నా ముందు రిలీజయ్యే సూచనలు లేవు. ఒకవేళ ఇంకా ఆలస్యమైన పక్షంలో దసరాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయట.
This post was last modified on July 8, 2022 7:21 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…