థియేటర్లో వచ్చిన తక్కువ రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటిటిలో వస్తున్నాయి కదా పైరసీ ఇంకెక్కడుందని కొందరు అనుకోవచ్చు కానీ నిజానికి డిజిటల్ కంటెంట్ పెరిగాక వీటి దూకుడు ఇంకా ఎక్కువయ్యింది. అన్ని యాప్స్ కి చందాలు తీసుకోలేని సగటు సినీ ప్రేక్షకులు పైరసీ సైట్ల మీద టొరెంట్ల మీద ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఐబొమ్మ. తక్కువ మెమరీతో క్వాలిటీ హెచ్డిలను ప్లాట్ ఫార్మ్ తో సంబంధం అన్నీ ఇవ్వడం దీని ప్రత్యేకత.
నిజానికిది లీగల్ యాప్ కాదు. చట్ట వ్యతిరేకం. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ ఎక్కడ ఎందులో ఏ కంటెంట్ వచ్చినా చాలు ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. పెద్దగా చదువు రాని వాళ్ళు దీన్ని వాడుతున్నారంటే రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఇండస్ట్రీ పెద్దలకు తెలియకుండా పోలేదు. ఓటిటిలు కూడా ఈ బొమ్మ మీద కన్నేసి సమయం కోసం వేచి చూశాయి. ఎట్టకేలకు దీనికి కళ్లెం పడింది. ఇకపై తాము సేవలు అందించలేమంటూ ఈ యాప్ శాశ్వతంగా సెలవు తీసుకోవడం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది.
ఇలాంటివి ఇంకా జరగాలి. పైరసీని రకరకాల మార్గాల్లో వీలైనంత కట్టడి చేసేందుకు అందరూ నడుం బిగించాలి. కాకపోతే పదుల సంఖ్యలో ఉన్న ఓటిటిలు కూడా వీలైనంత అందుబాటు ధరలతో సామాన్యుడికి చేరువయ్యే ప్రయత్నం చేస్తే ఇలాంటివి తగ్గుతాయి. ప్రతి శుక్రవారం ఒక్కో సినిమా ఒక్కో వెబ్ సిరీస్ రకరకాల యాప్స్ లో వస్తుంటే వాళ్ళైనా ఎన్నని కొంటారు. ఈ బలహీనత వల్లే బొమ్మలు బొరుసులు లాంటి యాప్స్ ఆన్ లైన్ వేదికగా చెలరేగిపోతున్నాయి. కోట్లాది సబ్స్క్రైబర్స్ ని ఆకట్టుకుని వాళ్ళ డేటాని తమ చిత్తానికి తీసుకుంటున్నాయి. దెబ్బకు కొందరు నెటిజెన్లు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు పోస్టులు పెట్టడం అసలు ట్విస్ట్.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…