రేపు విడుదల కాబోతున్న హ్యాపీ బర్త్ డేకి టికెట్ రేట్లు భారీగా తగ్గించామని యూనిట్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేసుకుంటోంది. ముఖ్యంగా నైజామ్ లో సింగల్ స్క్రీన్ ధర కేవలం 110 రూపాయలే అనే క్యాప్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అయితే మల్టీ ప్లెక్సులకు 177 నిర్ణయించడం అంత ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడం లేదు. ఇంకో పాతిక తగ్గించి నూటా యాభైకి లాక్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే అధిక శాతం ఆడియన్స్ కి లొకేషన్ పరంగా అందుబాటులో ఉన్నది ఇవే.
ఇంతా చేసి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా లేవు. ఎక్కడా యాభై శాతం ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఇక్కడైతే ఇలా చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాత రేట్లే ఉండటంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి ఎత్తుగడ కాస్త ఇమేజ్ ఉన్న హీరోల రిలీజుల టైంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప లావణ్య త్రిపాఠి లాంటి హీరొయిన్ ఓరియెంటెడ్ మూవీకి కాదు. ఎంత ట్రెండీ కంటెంట్ ఉన్నా మొదటి రోజే థియేటర్ లో చూసేద్దామనే ఆత్రం ఉండదుగా.
సో హ్యాపీ బర్త్ డే హిట్ అయినా కాకపోయినా ఇది కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదూ మళ్ళీ మొదటికే వెళతాం అంటే ఎవరేం చేయలేరు. దీని పరిస్థితే ఇలా ఉంటే అసలే బజ్ లేని చిన్న సినిమాలు గంధర్వ, మా నాన్న నక్సలైట్, రుద్రసింహ లాంటి వాటి గురించి చెప్పేదేముంది. థియేటర్లను ఎలా ఫుల్ చేయాలనే ఆలోచన చేయకుండా కేవలం మొదటి రెండు మూడు రోజుల్లోనే వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాలనే ధోరణిని వీడకపోతే రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటేనే లాంగ్ రన్ లో ఫలితాలు బాగుంటాయి. లేదంటే అంతే సంగతులు.
This post was last modified on July 7, 2022 4:55 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…