రేపు విడుదల కాబోతున్న హ్యాపీ బర్త్ డేకి టికెట్ రేట్లు భారీగా తగ్గించామని యూనిట్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేసుకుంటోంది. ముఖ్యంగా నైజామ్ లో సింగల్ స్క్రీన్ ధర కేవలం 110 రూపాయలే అనే క్యాప్షన్ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అయితే మల్టీ ప్లెక్సులకు 177 నిర్ణయించడం అంత ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడం లేదు. ఇంకో పాతిక తగ్గించి నూటా యాభైకి లాక్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే అధిక శాతం ఆడియన్స్ కి లొకేషన్ పరంగా అందుబాటులో ఉన్నది ఇవే.
ఇంతా చేసి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా లేవు. ఎక్కడా యాభై శాతం ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. ఇక్కడైతే ఇలా చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాత రేట్లే ఉండటంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇలాంటి ఎత్తుగడ కాస్త ఇమేజ్ ఉన్న హీరోల రిలీజుల టైంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప లావణ్య త్రిపాఠి లాంటి హీరొయిన్ ఓరియెంటెడ్ మూవీకి కాదు. ఎంత ట్రెండీ కంటెంట్ ఉన్నా మొదటి రోజే థియేటర్ లో చూసేద్దామనే ఆత్రం ఉండదుగా.
సో హ్యాపీ బర్త్ డే హిట్ అయినా కాకపోయినా ఇది కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదూ మళ్ళీ మొదటికే వెళతాం అంటే ఎవరేం చేయలేరు. దీని పరిస్థితే ఇలా ఉంటే అసలే బజ్ లేని చిన్న సినిమాలు గంధర్వ, మా నాన్న నక్సలైట్, రుద్రసింహ లాంటి వాటి గురించి చెప్పేదేముంది. థియేటర్లను ఎలా ఫుల్ చేయాలనే ఆలోచన చేయకుండా కేవలం మొదటి రెండు మూడు రోజుల్లోనే వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాలనే ధోరణిని వీడకపోతే రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ఇది అందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటేనే లాంగ్ రన్ లో ఫలితాలు బాగుంటాయి. లేదంటే అంతే సంగతులు.
This post was last modified on July 7, 2022 4:55 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…