సౌత్ హీరోలు, దర్శకులు నార్త్ మార్కెట్ను కొల్లగొట్టేస్తుంటే.. బాలీవుడ్ హీరోలు సౌత్లో మార్కెట్ పెంచుకోవడం మీద దృష్టిసారిస్తున్నారిప్పుడు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలన్నీ దక్షిణాది భాషల్లోనూ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ ఈ విషయంలో మరింతగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అతను తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది కూడా దక్షిణాది అమ్మాయి అయిన నయనతార అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. అతను సంగీతం అందిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే. ఇక తాజా సమాచారం ప్రకారం ‘జవాన్’లో విలన్గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో షారుఖ్తో కలిసి విజయ్ సేతుపతి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పుడు విజయ్ గురించి షారుఖ్ చాలా గొప్పగా మాట్లాడాడు. అతను మేటి నటుడని చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ను విజయ్ సేతుపతి లాంటి మేటి నటుడు ఢీకొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. హీరోగా మంచి స్థాయి అందుకున్నప్పటికీ.. క్యారెక్టర్, విలన్ రోల్స్ వదిలిపెట్టట్లేదు సేతుపతి.
ఇటీవలే ‘విక్రమ్’లో విలన్ పాత్రలో అతను అదరగొట్టాడు. నెగెటివ్ రోల్స్లోనే విజయ్ బెస్ట్ పెర్ఫామెన్స్ బయటికి వస్తుంటుంది. నిజానికి అతను ‘లాల్ సింగ్ చద్దా’తోనే బాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. కానీ డేట్లు సర్దుబాటు కాక కుదర్లేదు. ఆ పాత్ర తర్వాత నాగచైతన్యకు దక్కింది. ఇప్పుడు షారుఖ్ సినిమాలో విలన్ పాత్రను మాత్రం విజయ్ వదులుకునే ఛాన్స్ లేదు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 1న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 7, 2022 4:15 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…