Movie News

ప్రభాస్ కి టివీలోనూ చేదు అనుభవమే

బాహుబలి ఫ్రాంచైజీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడన్న సంగతి తెలిసిందే. అక్కడి నుండి వరుస ఫ్లాపులు అందుకుంటూ తన ఇమేజ్ ని తగ్గించేసుకున్తున్నాడు ప్రభాస్.
బాహుబలి 2 తర్వాత వచ్చిన ‘సాహో’ , రాదే శ్యామ్ సినిమాలు నిరాశ పరిచి ఫ్లాప్ అనిపించుకున్నాయి. ‘సాహో’ నార్త్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ తో సేఫ్ అనిపించుకుంది. కానీ రాధేశ్యామ్ నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.

తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా డిజాస్టర్ అనిపించుకుంది. పోయిన ఆదివారం ఈ సినిమా జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. జీ సంస్థ కొన్ని గ్రౌండ్ ఈవెంట్స్ లాంటివి కూడా చేసి బాగానే ప్రమోట్ చేశారు. ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉండే భీమవరంలో రాధేశ్యామ్ థీమ్ పార్క్ అనే కాన్సెప్ట్ తో ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒకచోట చేరి అందరూ సినిమా చూడాల్సిందే అంటూ గ్రూపులు కట్టారు. దీంతో ఈ సినిమా టెలివిజన్ లో మంచి రేటింగ్ దక్కించుకోవడం అనుకున్నారు అంతా.

కానీ ఇప్పుడు రేటింగ్ చూస్తే రివర్స్ లో ఉంది. తొలిసారి బుల్లితెరపై రాధేశ్యామ్ కి దక్కిన టీ ఆర్ పి కేవలం 8.25 . నిజానికి ఇది చాలా తక్కువే. గతంలో ఇదే చానెల్ లో టెలికాస్ట్ అయిన ‘వకీల్ సాబ్’ 19 పైనే టి ఆర్ పి అందుకుంది. బంగార్రాజు కూడా 14 పైనే స్కోర్ చేసింది.

ప్రభాస్ ‘సాహో’ కి కూడా టివీలో ఇలాంటి ఫలితమే వచ్చింది. ఆ సినిమాకు గానూ 5.81 టిఆర్పి వచ్చింది. అప్పట్లో అదే టైంలో ఈటీవీలో ప్రసారమైన ‘గుణ 369’ 5.9 టిఆర్పి వచ్చింది. అంటే కుర్ర హీరో కార్తికేయ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు రేటింగ్ తక్కువ రావడం అప్పట్లో చర్చనియంశం అయ్యింది.

దాన్ని ఆ సినిమా టీం ఛానెల్ వారు బాగా మార్కెట్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. మరి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కి కూడా తక్కువ రేటింగే దక్కింది. నాగార్జున కంటే ప్రభాస్ సినిమా టిఆర్పి తక్కువ రావడం నమ్మలేకుండా ఉంది. మరి టివీలో ప్రభాస్ ఇమేజ్ తగ్గిపోతుందా ? లేదా ఫ్లాప్ సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదా ? ప్రభాస్ అండ్ టీం ఒకసారి అనాలసిస్ చేసుకోవాల్సిందే.

This post was last modified on July 7, 2022 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

5 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

6 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

7 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

7 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

7 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

8 hours ago