బాహుబలి ఫ్రాంచైజీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడన్న సంగతి తెలిసిందే. అక్కడి నుండి వరుస ఫ్లాపులు అందుకుంటూ తన ఇమేజ్ ని తగ్గించేసుకున్తున్నాడు ప్రభాస్.
బాహుబలి 2 తర్వాత వచ్చిన ‘సాహో’ , రాదే శ్యామ్ సినిమాలు నిరాశ పరిచి ఫ్లాప్ అనిపించుకున్నాయి. ‘సాహో’ నార్త్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ తో సేఫ్ అనిపించుకుంది. కానీ రాధేశ్యామ్ నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
తాజాగా ఈ సినిమా బుల్లితెరపై కూడా డిజాస్టర్ అనిపించుకుంది. పోయిన ఆదివారం ఈ సినిమా జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. జీ సంస్థ కొన్ని గ్రౌండ్ ఈవెంట్స్ లాంటివి కూడా చేసి బాగానే ప్రమోట్ చేశారు. ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉండే భీమవరంలో రాధేశ్యామ్ థీమ్ పార్క్ అనే కాన్సెప్ట్ తో ప్రమోట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒకచోట చేరి అందరూ సినిమా చూడాల్సిందే అంటూ గ్రూపులు కట్టారు. దీంతో ఈ సినిమా టెలివిజన్ లో మంచి రేటింగ్ దక్కించుకోవడం అనుకున్నారు అంతా.
కానీ ఇప్పుడు రేటింగ్ చూస్తే రివర్స్ లో ఉంది. తొలిసారి బుల్లితెరపై రాధేశ్యామ్ కి దక్కిన టీ ఆర్ పి కేవలం 8.25 . నిజానికి ఇది చాలా తక్కువే. గతంలో ఇదే చానెల్ లో టెలికాస్ట్ అయిన ‘వకీల్ సాబ్’ 19 పైనే టి ఆర్ పి అందుకుంది. బంగార్రాజు కూడా 14 పైనే స్కోర్ చేసింది.
ప్రభాస్ ‘సాహో’ కి కూడా టివీలో ఇలాంటి ఫలితమే వచ్చింది. ఆ సినిమాకు గానూ 5.81 టిఆర్పి వచ్చింది. అప్పట్లో అదే టైంలో ఈటీవీలో ప్రసారమైన ‘గుణ 369’ 5.9 టిఆర్పి వచ్చింది. అంటే కుర్ర హీరో కార్తికేయ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు రేటింగ్ తక్కువ రావడం అప్పట్లో చర్చనియంశం అయ్యింది.
దాన్ని ఆ సినిమా టీం ఛానెల్ వారు బాగా మార్కెట్ చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. మరి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కి కూడా తక్కువ రేటింగే దక్కింది. నాగార్జున కంటే ప్రభాస్ సినిమా టిఆర్పి తక్కువ రావడం నమ్మలేకుండా ఉంది. మరి టివీలో ప్రభాస్ ఇమేజ్ తగ్గిపోతుందా ? లేదా ఫ్లాప్ సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదా ? ప్రభాస్ అండ్ టీం ఒకసారి అనాలసిస్ చేసుకోవాల్సిందే.
This post was last modified on July 7, 2022 2:37 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…