టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ మార్కెట్ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. కొందరు ప్లానింగ్తో తెలుగు రాష్ట్రాల అవతల ఫాలోయింగ్ సంపాదిస్తుంటే.. కొందరికి అనుకోకుండానే ఆదరణ దక్కుతోంది. యువ కథానాయకుడు రామ్.. ఇలాగే ఉత్తరాదిన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యూట్యూబ్లో రిలీజయ్యే అతడి డబ్బింగ్ సినిమాలతో అతను అక్కడ బాగా పాపులర్ అయ్యాడు. అతడి సినిమాల డబ్బింగ్ హక్కులు కోట్లు పలుకుతున్నాయిప్పుడు. దక్షిణాదిన మాత్రం రామ్ పాపులారిటీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం.
ఐతే ఇప్పుడు తమిళంలో అతను మార్కెట్ సంపాదించే ప్రయత్నంలో పడ్డాడు. తన కొత్త చిత్రం ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 15నే ది వారియర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రూపొందించింది తమిళ దర్శకుడే అయిన లింగుస్వామి కావడం విశేషం.
లింగుస్వామికి తమిళంలో మంచి పేరుంది. కొన్ని భారీ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ చిత్రంలో ఆది విలన్గా నటించడం కూడా తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయమే. ఇక రిలీజ్ ముంగిట సినిమాను తమిళంలో బాగా ప్రమోట్ చేయడం కోసం మాస్టర్ ప్లానే వేశాడు లింగుస్వామి. తనకున్న పరిచయాలు, పలుకుబడితో ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు.
బుధవారం చెన్నైలోని ఫేమస్ సత్యం సినిమాస్లో జరిగే ఈ ఈవెంట్కు దాదాపు 30 మంది కోలీవుడ్ ప్రముఖులు అతిథులుగా రాబోతుండడం విశేషం. వారిలో మణిరత్నం, భారతీరాజా, శంకర్, ప్రభు, గౌతమ్ మీనన్ లాంటి లెజెండ్స్తో పాటు లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, ఎస్.జె.సూర్య, మిత్రన్, విజయ్ మిల్టన్ లాంటి ప్రముఖ దర్శకులు.. కార్తి, విశాల్, ఆర్య, విక్రమ్ ప్రభు లాంటి పేరున్న హీరోలు.. ఇలా ఈ జాబితాలో చాలా పెద్దగానే ఉంది. బహుశా కోలీవుడ్లో ఇంతమంది ప్రముఖులు ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావచ్చు. మొత్తానికి రామ్ కోలీవుడ్ ఎంట్రీకి ప్రమోషనల్ ప్లాన్ మామూలుగా లేదు.
This post was last modified on July 6, 2022 3:10 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…