హీరోయిన్లకు కెరీర్ ఆరంభంలో వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే ఐరెన్ లెగ్ ముద్ర వేసి సాగనంపేస్తారు. ఈ ముద్రను తొలగించుకుని కొంతమంది హీరోయిన్లే నిలబడగలుగుతారు. సౌత్లో అలాంటి హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. పూజా హెగ్డేది సైతం ఇలాంటి ప్రయాణమే. తమిళంలో ఆమె తొలి చిత్రం ‘మాస్క్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ముకుంద, ఒక లైలా కోసం కూడా సరిగా ఆడలేదు. హిందీలో ఏమో ‘మొహెంజదారో’ లాంటి ఆల్ టైం డిజాస్టర్తో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ స్థితిలో పూజ కెరీర్ ముందుకు సాగదనే అంతా అనుకున్నారు.
కానీ ‘దువ్వాడ జగన్నాథం’తో రీఎంట్రీ ఇచ్చి గ్లామర్ విందు చేయడంతో కుర్రకారుకు ఆమె బాగా నచ్చేసింది. ఆ సినిమా కూడా అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆపై తెలుగులో ఆమె పెద్ద పెద్ద సినిమాలు చేసి ఘనవిజయాలందుకోవడం తెలిసిందే. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.
ఐతే తాను హీరోయిన్గా పరిచయం అయిన కోలీవుడ్లో జెండా పాతాలని పూజ కోరుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ భారీ చిత్రంతో అక్కడ రీఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. అదే.. విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’. ఈ సినిమా రిలీజ్కు ముందు పూజా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే ‘బీస్ట్’ డిజాస్టర్ అయింది. అందులో ఆమె పాత్రకు అసలు ప్రాధాన్యం కూడా లేకపోయింది. తమిళంలో చేసిన రెండో సినిమా కూడా డిజాస్టర్ కావడంతో పూజకు అక్కడ ఇక కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కడం విశేషం.
కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్యతో ఆమె జత కట్టబోతోంది. ప్రస్తుతం వెట్రిమారన్, బాలా సినిమాల్లో నటిస్తున్న సూర్య.. దీని తర్వాత మాస్ డైరెక్టర్ శివతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అజిత్తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి పెద్ద హిట్లిచ్చిన దర్శకుడతను. చివరగా రజినీతో అతను తీసిన ‘అన్నాత్తె’ అంచనాలను అందుకోలేకపోయింది. అతను సూర్య కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా పూజ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. మరి కోలీవుడ్లో మూడో సినిమా అయినా ఆమె కోరుకున్న విజయాన్నిస్తుందేమో చూడాలి.
This post was last modified on July 6, 2022 2:57 pm
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…