మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్లో మంచి పేరున్న కథానాయికే. కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్తో ‘సూపర్ 30’ లాంటి పెద్ద సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హోమ్లీ లుక్స్తో ఉండే మృణాల్ చాలా వరకు ట్రెడిషనల్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది. కానీ ఆమె గ్లామర్ విందు చేయడానికి ఆమె సిద్ధమే అని ఈ మధ్యే బాలీవుడ్ జనాలకు అర్థమవుతోంది.
ధమాకా, జెర్సీ లాంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంటూనే ఆమె గ్లామర్ విందు కూడా చేసింది. హాట్ హాట్ సీన్లలో నటించింది. బయట ఆమె చేసే ఫొటో షూట్లు కూడా హాట్ హాట్గా ఉంటున్నాయి. బాలీవుడ్లో కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్న మృణాల్కు తెలుగులో అవకాశం వచ్చింది. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి కళ్లు ఆమెపై పడ్డాయి. తన కొత్త చిత్రం ‘సీతారామం’లో సీత పాత్రకు మృణాల్నే ఎంచుకున్నాడతను.
ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పటి నుంచి మృణాల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలోని రెండు పాటలు చూశాక మృణాల్ మరింతగా నచ్చేస్తోంది. తాజాగా రిలీజైన ‘ఇంతందం’ పాటలో అయితే ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ కట్టి పడేస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏమో కానీ మృణాల్ మాత్రం మాయ చేయబోతోందని స్పష్టమవుతోంది. దుల్కర్ లాంటి మంచి పెర్ఫామర్కు దీటుగానే మృణాల్ కనిపించేలా ఉంది. వాళ్లిద్దరి కెమిస్ట్రీనే సినిమాకు బలంగా నిలిచేలా ఉంది.
తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోల పక్కన నటించే కథానాయికల విషయంలో కొరత ఉంది. కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ల జోరు తగ్గిపోయింది. అందరూ పూజా హెగ్డే, రష్మికల వెంటే పడుతున్నారు. వాళ్లనే రిపీట్ చేయాల్సి వస్తోంది. అడిగిన సినిమాలన్నింటికీ వాళ్లు ఓకే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి టైంలో కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందం, అభినయం రెండూ ఉన్న మృణాల్కు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా తొలి చిత్రం హిట్టవడం, ఆమెకు పేరు రావడం. ‘సీతారామం’ ఆ మ్యాజిక్ చేస్తుందనే అనిపిస్తోంది.
This post was last modified on July 6, 2022 2:50 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…