మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్లో మంచి పేరున్న కథానాయికే. కెరీర్ ఆరంభంలోనే హృతిక్ రోషన్తో ‘సూపర్ 30’ లాంటి పెద్ద సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హోమ్లీ లుక్స్తో ఉండే మృణాల్ చాలా వరకు ట్రెడిషనల్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసింది. కానీ ఆమె గ్లామర్ విందు చేయడానికి ఆమె సిద్ధమే అని ఈ మధ్యే బాలీవుడ్ జనాలకు అర్థమవుతోంది.
ధమాకా, జెర్సీ లాంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంటూనే ఆమె గ్లామర్ విందు కూడా చేసింది. హాట్ హాట్ సీన్లలో నటించింది. బయట ఆమె చేసే ఫొటో షూట్లు కూడా హాట్ హాట్గా ఉంటున్నాయి. బాలీవుడ్లో కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్న మృణాల్కు తెలుగులో అవకాశం వచ్చింది. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి కళ్లు ఆమెపై పడ్డాయి. తన కొత్త చిత్రం ‘సీతారామం’లో సీత పాత్రకు మృణాల్నే ఎంచుకున్నాడతను.
ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పటి నుంచి మృణాల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలోని రెండు పాటలు చూశాక మృణాల్ మరింతగా నచ్చేస్తోంది. తాజాగా రిలీజైన ‘ఇంతందం’ పాటలో అయితే ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ కట్టి పడేస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏమో కానీ మృణాల్ మాత్రం మాయ చేయబోతోందని స్పష్టమవుతోంది. దుల్కర్ లాంటి మంచి పెర్ఫామర్కు దీటుగానే మృణాల్ కనిపించేలా ఉంది. వాళ్లిద్దరి కెమిస్ట్రీనే సినిమాకు బలంగా నిలిచేలా ఉంది.
తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోల పక్కన నటించే కథానాయికల విషయంలో కొరత ఉంది. కాజల్, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ల జోరు తగ్గిపోయింది. అందరూ పూజా హెగ్డే, రష్మికల వెంటే పడుతున్నారు. వాళ్లనే రిపీట్ చేయాల్సి వస్తోంది. అడిగిన సినిమాలన్నింటికీ వాళ్లు ఓకే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి టైంలో కొత్త ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందం, అభినయం రెండూ ఉన్న మృణాల్కు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా తొలి చిత్రం హిట్టవడం, ఆమెకు పేరు రావడం. ‘సీతారామం’ ఆ మ్యాజిక్ చేస్తుందనే అనిపిస్తోంది.
This post was last modified on July 6, 2022 2:50 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…