మధురవాణిగా అనసూయ ఎంట్రీ

తవ్వి తీయాలే కానీ పాత తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోతున్న ప్రేక్షకులను థియేటర్ దాకా రప్పించే మంత్రదండం వాటిలో ఉందనే కొత్త తరం దర్శకులు క్రమంగా పెరుగుతున్నారు. దీన్ని మొదటగా అందిపుచ్చుకున్నది దర్శకుడు క్రిష్.

ఆ మధ్య మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి తొమ్మిది గంటల నవలను నైన్ అవర్స్ పేరుతో హాట్ స్టార్ కోసం వెబ్ సిరీస్ గా తీయిస్తే దానికి మంచి పేరే వచ్చింది. క్రిష్ డైరెక్షన్ చేయకపోయినా రచనతో సహా నిర్మాణ వ్యవహారాలన్నీ ఆయనవే.

ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం ఆయనే నేరుగా రంగంలోకి దిగనుండటం హాట్ టాపిక్ గా మారింది. సుప్రసిద్ధ నాటకం కన్యాశుల్కంని ఓటిటిలో తీసుకొస్తారట. ఇందులో అతి కీలకమైన వేశ్య మధురవాణి పాత్రను యాంకర్ అనసూయతో చేయించేందుకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టుగా తెలిసింది.

నిజానికి వేదంలో అనుష్క క్యారెక్టర్ ని డిజైన్ చేసింది ఈ ప్రభావంతోనే. ఇప్పుడు నేరుగా ఒరిజినల్ స్టైల్ లో చూపించబోతున్నారు. గురజాడ అప్పారావుగారు రచించిన ఈ నాటకం మీద అన్న ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కూడా ఉంది.

ఇప్పటి కాలానికి ఈ కన్యాశుల్కం కాన్సెప్ట్ ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూస్తే కానీ చెప్పలేం. అసలే ఆడియన్స్ అభిరుచులు విభిన్నంగా మారుతున్నాయి. ఎప్పుడో జరిగినవి చరిత్ర మర్చిపోయినవి చూపిస్తామంటే అంతగా ఆసక్తి కనబర్చడం లేదు.

ఈ కారణంగానే నక్సలిజం బ్యాక్ డ్రాప్ మూవీస్ దారుణంగా దెబ్బ తింటున్నాయి. వాటితో కన్యాశుల్కంని పోల్చలేం కానీ మొత్తానికి రిస్క్ అయితే ఉంది. దూరదర్శన్ ఛానల్ లో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ గా సీరియల్ వచ్చింది. మరి క్రిష్ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

1 hour ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

3 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago