సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడి రెండు వారాలు దాటిపోయింది. అతడిది ఆత్మహత్యే అని తేల్చినప్పటికీ.. అతను అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అతడి జీవితంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఒకప్పుడు అంకిత లోఖండెతో సీరియస్గా కొన్నేళ్ల పాటు రిలేషన్షిప్ నడిపాడు సుశాంత్. కారణాలేంటో తెలియవు కానీ ఆమె నుంచి విడిపోయాడు. సుశాంత్ ఎంతో సంతోషంగా ఉన్న రిలేషన్షిప్ ఇదే అంటారు. తర్వాత కృతి సనన్తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడంటారు కానీ.. దానిపై స్పష్టత లేదు. ఆమెతో అతను ‘రాబ్తా’ అనే సినిమా చేసినంత కాలమే ఇలాంటి వార్తలు వినిపించాయి.
ఐతే తర్వాత రియా చక్రవర్తితో మాత్రం సుశాంత్ సీరియస్గానే ప్రేమాయణం నడిపాడని.. వాళ్లిద్దరూ ఈ ఏడాది అక్టోబరులో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. రియాను పోలీసులు కొన్ని రోజుల పాటు విచారించడం కూడా తెలిసిందే. ఐతే ఆ విచారణ సందర్భంగా రియా దాచిపెట్టిన ఓ విషయాన్ని పోలీసులు తమ విచారణలో కనుగొన్నట్లు తెలుస్తోంది. రియా సోదరుడు షఓవిక్ చక్రవర్తితో కలిసి సుశాంత్ వ్యాపారం చేస్తున్నాడట. ‘వివద్రేజ్ రియాలిటిక్స్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫిర్మ్ ఏర్పాటు చేసి వీళ్లిద్దరూ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని తన స్టేట్మెంట్లో రియా వెల్లడించకపోవడంతో సుశాంత్ ఆత్మహత్య వెనుక ఈ వ్యాపార సంబంధిత విషయాలేమైనా ఉన్నాయేమో అన్న అనుమానంతో పోలీసులు షోవిక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట.
This post was last modified on June 30, 2020 11:11 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…