నందమూరి కళ్యాణ్ రామ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తన మార్కెట్ స్థాయికి మించిన బడ్జెట్లతో సాహసాలు చేయడం అతడికి కొత్తేమీ కాదు. ‘బింబిసార’తో కూడా అలాంటి సాహసానికే పూనుకున్నాడు. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని నమ్మి భారీ బడ్జెట్లో ‘బింబిసార’ సినిమాను నిర్మించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఆషామాషీగా ఏమీ తీయలేదని.. బాగా ఖర్చు పెట్టి రాజీ లేకుండా ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించాడని ట్రైలర్ చూస్త స్పష్టమైంది.
విజువల్స్, సెట్టింగ్స్, గ్రాఫిక్స్.. అన్నింట్లోనూ ఒక స్థాయి కనిపించింది. కాకపోతే పటాస్, 118 తప్పితే గత దశాబ్దంన్నర కాలంలో హిట్లే లేని కళ్యాణ్ రామ్.. ఏ నమ్మకంతో ఇంత భారీ సినిమాలు చేయగలుగుతున్నాడన్నది ప్రశ్న. అందులోనూ ఈ మధ్య సినిమాల థియేట్రికల్ బిజినెస్ చాలా దెబ్బ తినేసింది. ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది.
ఇలాంటి సమయంలో మార్కెట్ బాగా దెబ్బ తిన్న కళ్యాణ్ రామ్ లాంటి హీరో పెద్ద బడ్జెట్లో ‘బింబిసార’ లాంటి ఒక సినిమా చేయడమే ఆశ్చర్యం అంటే.. దీన్నొక ఫ్రాంఛైజీలా మారుస్తామని, ఈ సినిమాకు కొనసాగింపుగా ఇంకో మూడు చిత్రాలు వస్తాయని చెబుతుండటం విశేషం. ‘బింబిసార-2’కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని, వచ్చే ఏడాది ఆగస్టు 23న రెండో భాగం రిలీజవుతుందని కళ్యాణ్ రామ్ ప్రకటన చేయడం గమనార్హం. కుదిరితే తర్వాతి భాగాల్లో తన తమ్ముడు ఎన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ పేర్కొనడం నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేదే.
ఐతే ముందు ఆగస్టు 5న విడుదల కాబోతున్న ‘బింబిసార’ను ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం రావాలి. అప్పుడే సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేటవుతుంది. ఆర్థికంగా అది వర్కవుట్ అవుతుంది అనిపిస్తేనే సినిమా చేస్తారు. ఆ తర్వాత 3, 4 భాగాల గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి ‘బింబిసార’కు హైప్ తీసుకురావడానికే ఫ్రాంఛైజీ, నాలుగు భాగాలు అని కళ్యాణ్ రామ్ మాట్లాడినట్లు కనిపిస్తోంది.
This post was last modified on July 5, 2022 3:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…