కోలీవుడ్ అభిమానులు ప్రేమతో మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే విజయ్ సేతుపతి పాత్రల పరంగా ఎలాంటి పరిమితులు విధించుకోకుండా కాంబినేషన్ నచ్చితే ఏ క్యారెక్టర్ వచ్చినా కాల్ షీట్స్ ఉంటే చాలు చేసేస్తున్నాడు. ఉప్పెన, విక్రమ్, మాస్టర్ లలో విలన్ గా చూపించిన విశ్వరూపం తన ఫ్యాన్ బేస్ ని పెంచేసింది. అయితే హీరోగా ఫెయిలవుతున్న విజయ్ సేతుపతికి ఇప్పుడీ కెరీరే బాగున్నట్టు అనిపిస్తోంది. అందుకే దర్శకులు సైతం దుర్మార్గంగా చూపించే అలాంటి నెగటివ్ వేషాలతోనే తనను సంప్రదిస్తున్నారు.
తాజాగా షారుఖ్ ఖాన్ తో ఆట్లీ రూపొందిస్తున్న జవాన్ లో విలన్ గా విజయ్ సేతుపతినే ఎంచుకున్నట్టు చెన్నై టాక్. ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని బాద్షా ఫైనల్ గా ఓకే చెప్పాక అఫీషియల్ గా ప్రకటిస్తారట. ఈ సినిమాలో ఇంతకు ముందు బాలీవుడ్ ఎన్నడూ చూడని అతి క్రూరమైన విలనీని ఆట్లీ రాసుకున్నాడట. దానికి ఆషామాషీ నటులైతే న్యాయం చేయలేరని భావించి మక్కల్ సెల్వన్ ను అడిగారు. చిరంజీవి కోసమని సైరాలో చిన్న క్యామియో చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడీ ఆఫర్ ని వద్దనే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.
పుష్ప 2 లోనూ తన కోసం దర్శకుడు సుకుమార్ ఒక ప్రత్యేకమైన ట్రాక్ రాసుకున్నారని ఇప్పటికే మైత్రి కాంపౌండ్ నుంచి లీకయిన న్యూస్. మొదటి భాగంలోనే అనుకున్నప్పటికీ కాల్ షీట్స్ సమస్య రావడంతో ఆ స్థానంలో ఫహద్ ఫాసిల్ వచ్చి ఆ లోటుని అద్భుతంగా పూరించాడు. ఇప్పుడు తనకు తోడుగా విక్రమ్ తరహాలో ఈ ఇద్దరి కాంబోని సెట్ చేస్తే అల్లు అర్జున్ తో ఢీ కొట్టే ఎపిసోడ్స్ కెజిఎఫ్ రేంజ్ లో వస్తాయని సుక్కు భావించినట్టు తెలిసింది. ఈ రెండూ ఓకే అయితే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ పక్కా డబుల్ బొనాంజానే.
This post was last modified on July 5, 2022 1:24 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…