Movie News

విజయ్ సేతుపతి డబుల్ బొనాంజా

కోలీవుడ్ అభిమానులు ప్రేమతో మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే విజయ్ సేతుపతి పాత్రల పరంగా ఎలాంటి పరిమితులు విధించుకోకుండా కాంబినేషన్ నచ్చితే ఏ క్యారెక్టర్ వచ్చినా కాల్ షీట్స్ ఉంటే చాలు చేసేస్తున్నాడు. ఉప్పెన, విక్రమ్, మాస్టర్ లలో విలన్ గా చూపించిన విశ్వరూపం తన ఫ్యాన్ బేస్ ని పెంచేసింది. అయితే హీరోగా ఫెయిలవుతున్న విజయ్ సేతుపతికి ఇప్పుడీ కెరీరే బాగున్నట్టు అనిపిస్తోంది. అందుకే దర్శకులు సైతం దుర్మార్గంగా చూపించే అలాంటి నెగటివ్ వేషాలతోనే తనను సంప్రదిస్తున్నారు.

తాజాగా షారుఖ్ ఖాన్ తో ఆట్లీ రూపొందిస్తున్న జవాన్ లో విలన్ గా విజయ్ సేతుపతినే ఎంచుకున్నట్టు చెన్నై టాక్. ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని బాద్షా ఫైనల్ గా ఓకే చెప్పాక అఫీషియల్ గా ప్రకటిస్తారట. ఈ సినిమాలో ఇంతకు ముందు బాలీవుడ్ ఎన్నడూ చూడని అతి క్రూరమైన విలనీని ఆట్లీ రాసుకున్నాడట. దానికి ఆషామాషీ నటులైతే న్యాయం చేయలేరని భావించి మక్కల్ సెల్వన్ ను అడిగారు. చిరంజీవి కోసమని సైరాలో చిన్న క్యామియో చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడీ ఆఫర్ ని వద్దనే ఛాన్స్ ఎంత మాత్రం లేదు.

పుష్ప 2 లోనూ తన కోసం దర్శకుడు సుకుమార్ ఒక ప్రత్యేకమైన ట్రాక్ రాసుకున్నారని ఇప్పటికే మైత్రి కాంపౌండ్ నుంచి లీకయిన న్యూస్. మొదటి భాగంలోనే అనుకున్నప్పటికీ కాల్ షీట్స్ సమస్య రావడంతో ఆ స్థానంలో ఫహద్ ఫాసిల్ వచ్చి ఆ లోటుని అద్భుతంగా పూరించాడు. ఇప్పుడు తనకు తోడుగా విక్రమ్ తరహాలో ఈ ఇద్దరి కాంబోని సెట్ చేస్తే అల్లు అర్జున్ తో ఢీ కొట్టే ఎపిసోడ్స్ కెజిఎఫ్ రేంజ్ లో వస్తాయని సుక్కు భావించినట్టు తెలిసింది. ఈ రెండూ ఓకే అయితే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ పక్కా డబుల్ బొనాంజానే.

This post was last modified on July 5, 2022 1:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

9 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

43 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago