బాలకృష్ణను మినహాయిస్తే నెక్స్ట్ తరంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశం నుంచి అంతో ఇంతో చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న హీరో కళ్యాణ్ రామ్ ఒక్కడే. కాకపోతే విజయం ఇతనితో దోబూచులాడుతూనే ఉంటుంది. ఒక హిట్టు వచ్చి కెరీర్ పైకెళ్తోందని ఆనందించే లోపే రెండు మూడు ఫ్లాపులు వచ్చి మార్కెట్ ని తగ్గిస్తాయి. దానికి తోడు ఆయా చిత్రాల నిర్మాణంలో జరిగే జాప్యం వల్ల ఏడాదికి రెండు మూడు సినిమాలు వచ్చేలా చేసుకోవాల్సిన ప్లానింగ్ లోనూ తారక్ అన్నయ్య తడబడుతున్నాడు. అదనంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద చూసుకుంటున్న స్వంత ప్రొడక్షన్ వ్యవహారాలు ఉండనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఎంత మంచివాడవురా వచ్చిన రెండేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారతో వస్తున్నాడు. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్నటి దాకా పెద్దగా హైప్ లేదు కానీ ఈ వీడియో చూశాక మాత్రం అంచనాలు వచ్చేలానే ఉన్నాయి. కాకపోతే నేపథ్యం మరీ కొత్తగా లేదు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇంటెన్సిటీ వగైరాలు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాయి. అంతులేని నిధిని స్వంతం చేసుకునే కుట్ర పన్నిన దుర్మార్గులను అడ్డుకోవడానికి బింబిసార రాజు మళ్ళీ పుట్టడమేనే కాన్సెప్ట్ తో రూపొందించినట్టు కనిపిస్తోంది.
కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మగధీర షేడ్స్ ఉన్నాయి. రావురమేష్ టైపు క్యారెక్టర్ లో అయ్యప్ప పి శర్మ, బాహుబలిని తలపించే గెటప్ తో ఫ్లాష్ బ్యాక్ కళ్యాణ్ రామ్, కొత్త జన్మలోనూ విలన్ ఉండటం ఇవన్నీ సిమిలర్ గా ఉన్నాయి. ఎంఎం కీరవాణి మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఆగస్ట్ 5న దుల్కర్ సల్మాన్ తో బింబిసార పోటీపడబోతున్నాడు. కంటెంట్ తో పాటు గ్రాఫిక్స్ మీద ఆధారపడిన ఈ ఫాంటసీ డ్రామాతో అయినా కళ్యాణ్ రామ్ పెద్ద బ్రేక్ అందుకుంటాడేమో చూడాలి. ఇందులో క్యాథరిన్ త్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లు కాగా వశిష్ట్ దర్శకత్వం వహించారు.
This post was last modified on July 4, 2022 8:54 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…