టికెట్ రేట్ల గురించి ముఖ్యంగా తెలంగాణలో ఎంత చర్చ జరుగుతోందో గత నాలుగైదు నెలలుగా చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ జిఓ ఇచ్చింది కదాని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు అత్యాశకు పోయి ధరలు పెంచేయడం ఓపెనింగ్స్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఓటిటిలో చూడొచ్చులే అనుకునే వాటికి కూడా మల్టీ ప్లెక్సులో 200 సింగల్ స్క్రీన్లలో 150కి పైగా పెట్టడం వల్ల కామన్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. అటు ఏపిలోనూ పరిస్థితి మరీ ఆశాజనకంగా లేదు కానీ పర్వాలేదు అంతే.
అందుకే హ్యాపీ బర్త్ డే టీమ్ పాత స్ట్రాటజీకి వెళ్లిపోయింది. తమ సినిమాకు సింగల్ స్క్రీన్లలో 110 రూపాయలు, మాల్స్ లో 177 రూపాయలు టికెట్ రేట్ పెడుతూ దాన్నే మార్కెటింగ్ కోసం వాడుకుంటోంది. నిజానికి ఇందులో స్టార్ లెవరూ లేరు. కేవలం లావణ్య త్రిపాఠి కోసం హాలుకు జనం వచ్చే సీన్ లేదు. ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించి ఏదో ట్రెండీ కంటెంట్ ఉందనిపించడం వల్ల యూత్ కొంతమేరకు దీనికి టర్న్ అవ్వొచ్చు కానీ సామాన్య ప్రేక్షకులు రావాలంటే మాత్రం ఇలాంటి ఎత్తుగడలు వేయడం మంచి ఫలితాన్ని ఇవ్వొచ్చు.
అయితే ఇది ఒక్కదానికే పరిమితం చేయకుండా రాబోయే అన్ని బడ్జెట్ సినిమాలకు ఇదే తరహా రేట్లు పెడితే మళ్ళీ థియేటర్లలో కాస్త ఎక్కువ సందడి కనిపించే అవకాశాలున్నాయి. హిట్టు ఫ్లాపు తర్వాత ముందైతే జనం హాలు దాకా వచ్చేలా చేయాలి. అది లేకుండా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బిజినెస్ కోణంలోనే ఆలోచించడం వల్ల ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. ఒకవేళ హ్యాపీ బర్త్ డే ప్లాన్ కనక సక్సెస్ అయితే మిగిలినవాళ్లు కూడా అదే రూట్ పట్టొచ్చు. హైదరాబాద్ బుక్ మై షోలో రిలీజ్ రోజు ఒక సినిమా టికెట్ 110 రూపాయలు కనిపించి ఎంత కాలమయ్యిందో. పాత రోజులు గుర్తొస్తున్నాయని మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on July 4, 2022 6:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…