టికెట్ రేట్ల గురించి ముఖ్యంగా తెలంగాణలో ఎంత చర్చ జరుగుతోందో గత నాలుగైదు నెలలుగా చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ జిఓ ఇచ్చింది కదాని చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు అత్యాశకు పోయి ధరలు పెంచేయడం ఓపెనింగ్స్ మీద చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఓటిటిలో చూడొచ్చులే అనుకునే వాటికి కూడా మల్టీ ప్లెక్సులో 200 సింగల్ స్క్రీన్లలో 150కి పైగా పెట్టడం వల్ల కామన్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. అటు ఏపిలోనూ పరిస్థితి మరీ ఆశాజనకంగా లేదు కానీ పర్వాలేదు అంతే.
అందుకే హ్యాపీ బర్త్ డే టీమ్ పాత స్ట్రాటజీకి వెళ్లిపోయింది. తమ సినిమాకు సింగల్ స్క్రీన్లలో 110 రూపాయలు, మాల్స్ లో 177 రూపాయలు టికెట్ రేట్ పెడుతూ దాన్నే మార్కెటింగ్ కోసం వాడుకుంటోంది. నిజానికి ఇందులో స్టార్ లెవరూ లేరు. కేవలం లావణ్య త్రిపాఠి కోసం హాలుకు జనం వచ్చే సీన్ లేదు. ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించి ఏదో ట్రెండీ కంటెంట్ ఉందనిపించడం వల్ల యూత్ కొంతమేరకు దీనికి టర్న్ అవ్వొచ్చు కానీ సామాన్య ప్రేక్షకులు రావాలంటే మాత్రం ఇలాంటి ఎత్తుగడలు వేయడం మంచి ఫలితాన్ని ఇవ్వొచ్చు.
అయితే ఇది ఒక్కదానికే పరిమితం చేయకుండా రాబోయే అన్ని బడ్జెట్ సినిమాలకు ఇదే తరహా రేట్లు పెడితే మళ్ళీ థియేటర్లలో కాస్త ఎక్కువ సందడి కనిపించే అవకాశాలున్నాయి. హిట్టు ఫ్లాపు తర్వాత ముందైతే జనం హాలు దాకా వచ్చేలా చేయాలి. అది లేకుండా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బిజినెస్ కోణంలోనే ఆలోచించడం వల్ల ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. ఒకవేళ హ్యాపీ బర్త్ డే ప్లాన్ కనక సక్సెస్ అయితే మిగిలినవాళ్లు కూడా అదే రూట్ పట్టొచ్చు. హైదరాబాద్ బుక్ మై షోలో రిలీజ్ రోజు ఒక సినిమా టికెట్ 110 రూపాయలు కనిపించి ఎంత కాలమయ్యిందో. పాత రోజులు గుర్తొస్తున్నాయని మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.
This post was last modified on July 4, 2022 6:12 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…