మ్యాచో స్టార్ గోపీచంద్ కు పక్కా కమర్షియల్ కూడా దెబ్బేసింది. మారుతీ దర్శకుడు అందులోనూ మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి మినిమమ్ ఆడుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉండేది. కానీ ఫలితం నెగటివ్ గానే వచ్చేసింది. ఇన్నేసి కోట్లు వచ్చాయని టీమ్ వరసగా పోస్టర్లు వదులుతోంది కానీ కీలకమైన నిన్నటి వీకెండ్ లో కూడా భారీ ఫిగర్లేమీ నమోదు కాలేదు. గత వారం వచ్చిన సమ్మతమే సోసోగా ఆడి బాక్సాఫీస్ స్పేస్ ని వదిలేసినా దాన్ని వాడుకోవడంలో కమర్షియల్ ఫెయిలయ్యింది. పోటీ లేకపోయినా లాభం లేకపోయింది.
ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ శ్రీవాస్ డైరెక్షన్ లో చేయబోయే మూవీ మీదే ఉన్నాయి. ఇప్పటికే గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. 2014 లౌక్యం లాభాలు తెచ్చిన చివరి సక్సెస్. జిల్ పర్వాలేదనిపిస్తే సౌఖ్యం దారుణంగా బోల్తా కొట్టింది. గౌతమ్ నందాలో డ్యూయల్ రోల్ చేసినా ఏమీ ఒరగలేదు. ఆక్సిజన్ సంగతి సరేసరి. పంతం, చాణక్యలు ఎప్పుడు వచ్చాయో ఫ్యాన్స్ కే గుర్తు లేదు. సీటిమార్ సోసోగానే ఆడింది. బూజు దులిపి వదిలిన ఆరడుగుల బుల్లెట్ వల్ల కలిగిన ప్రయోజనం కన్నా డ్యామేజే ఎక్కువ.
మొత్తానికి గోపీచంద్ స్వీయ విశ్లేషణ సీరియస్ గా చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. మొదటి రోజు మినిమమ్ హౌస్ ఫుల్ చేసే రేంజ్ ని ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే బ్లాక్ బస్టర్ పడాలి. లేదంటే శ్రీకాంత్ తరహాలో మెల్లగా కెరీర్ గ్రాఫ్ ఇంకా డౌన్ అయిపోయి సపోర్టింగ్ రోల్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. లేదూ వర్షం, జయం తరహాలో ఏదైనా పవర్ ఫుల్ నెగటివ్ రోల్స్ చేసినా మళ్ళీ మార్కెట్ పుంజుకోవచ్చు. మాస్ అయితేనే తనను చూస్తారనే అభిప్రాయం నుంచి గోపీచంద్ అర్జెంట్ గా బయటికి రావాలి.
This post was last modified on July 4, 2022 3:52 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…