మ్యాచో స్టార్ గోపీచంద్ కు పక్కా కమర్షియల్ కూడా దెబ్బేసింది. మారుతీ దర్శకుడు అందులోనూ మాస్ ఎంటర్ టైనర్ కాబట్టి మినిమమ్ ఆడుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉండేది. కానీ ఫలితం నెగటివ్ గానే వచ్చేసింది. ఇన్నేసి కోట్లు వచ్చాయని టీమ్ వరసగా పోస్టర్లు వదులుతోంది కానీ కీలకమైన నిన్నటి వీకెండ్ లో కూడా భారీ ఫిగర్లేమీ నమోదు కాలేదు. గత వారం వచ్చిన సమ్మతమే సోసోగా ఆడి బాక్సాఫీస్ స్పేస్ ని వదిలేసినా దాన్ని వాడుకోవడంలో కమర్షియల్ ఫెయిలయ్యింది. పోటీ లేకపోయినా లాభం లేకపోయింది.
ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ శ్రీవాస్ డైరెక్షన్ లో చేయబోయే మూవీ మీదే ఉన్నాయి. ఇప్పటికే గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. 2014 లౌక్యం లాభాలు తెచ్చిన చివరి సక్సెస్. జిల్ పర్వాలేదనిపిస్తే సౌఖ్యం దారుణంగా బోల్తా కొట్టింది. గౌతమ్ నందాలో డ్యూయల్ రోల్ చేసినా ఏమీ ఒరగలేదు. ఆక్సిజన్ సంగతి సరేసరి. పంతం, చాణక్యలు ఎప్పుడు వచ్చాయో ఫ్యాన్స్ కే గుర్తు లేదు. సీటిమార్ సోసోగానే ఆడింది. బూజు దులిపి వదిలిన ఆరడుగుల బుల్లెట్ వల్ల కలిగిన ప్రయోజనం కన్నా డ్యామేజే ఎక్కువ.
మొత్తానికి గోపీచంద్ స్వీయ విశ్లేషణ సీరియస్ గా చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. మొదటి రోజు మినిమమ్ హౌస్ ఫుల్ చేసే రేంజ్ ని ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. దాన్ని తిరిగి రాబట్టుకోవాలంటే బ్లాక్ బస్టర్ పడాలి. లేదంటే శ్రీకాంత్ తరహాలో మెల్లగా కెరీర్ గ్రాఫ్ ఇంకా డౌన్ అయిపోయి సపోర్టింగ్ రోల్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. లేదూ వర్షం, జయం తరహాలో ఏదైనా పవర్ ఫుల్ నెగటివ్ రోల్స్ చేసినా మళ్ళీ మార్కెట్ పుంజుకోవచ్చు. మాస్ అయితేనే తనను చూస్తారనే అభిప్రాయం నుంచి గోపీచంద్ అర్జెంట్ గా బయటికి రావాలి.
This post was last modified on July 4, 2022 3:52 pm
దేశంలోనే అత్యధిక సినీ అభిమానం ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశయోక్తేమీ కాదు. కానీ ఇంతటి అభిమానం ఉన్న చోట…
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…