నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2కి అఫీషియల్ గా ముందు ప్రకటించిన విడుదల తేదీ జూలై 22. కానీ ఇప్పుడా డేట్ కి రావడం లేదని ఫిలిం నగర్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో పాటు ప్రమోషన్ కు తగినంత సమయం లేదని భావించడం వల్లే వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు అదే రోజు నాగ చైతన్య థాంక్ యుని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
ఇది కాకుండా కేవలం వారం గ్యాప్ లో మరో ప్యాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనా వస్తోంది. సుదీప్ హీరో కాబట్టి మార్కెటింగ్ బలంగా జరుగుతోంది. ఇది చాలదన్నట్టు రన్బీర్ కపూర్ శంషేరా కూడా అన్ని భాషల్లో 22నే వస్తోంది. ఇలా చూసుకుంటే అందరి కంటే మార్కెట్ పరంగా వీక్ గా ఉన్నది నిఖిలే. మధ్యలో వచ్చి నలిగిపోవడం కంటే సేఫ్ గా పక్కకు తప్పుకోవడం బెటరని అలోచించి ఉండొచ్చు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు.
కార్తికేయకు సీక్వెల్ అని చెబుతున్నారు కానీ ఇది పూర్తిగా వేరే కథతో రూపొందించినట్టు కనిపిస్తోంది. పైగా బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. అలాంటప్పుడు సోలోగా వస్తేనే బెటర్. ఇన్నేసి సినిమాలతో పోటీ పడితే ఓపెనింగ్స్ తో పాటు వసూళ్ల పరంగానూ ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది. అర్జున్ సురవరం వచ్చి మూడేళ్లు అవుతోంది. మళ్ళీ నిఖిల్ స్క్రీన్ మీద కనిపించలేదు. 18 పేజెస్, స్పై లకు బిజినెస్ బాగా జరగాలంటే ఈ కార్తికేయ 2 పెద్ద హిట్ అవ్వడం చాలా అవసరం. అందుకే ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు
This post was last modified on July 4, 2022 3:46 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…