నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘లైగర్’ గురించే చర్చ. ఇండియాలో టాప్లో ట్రెండ్ అయింది ఆ సినిమా పేరు. ‘లైగర్’ నుంచి రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ మామూలుగా ప్రకంపనలు రేపలేదు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఈ పోస్టర్ చూసి షాకైపోయారు. సామాన్య ప్రేక్షకుల విషయానికి వస్తే చాలా వరకు నెగెటివ్ కామెంట్లే పడ్డాయి ఆ పోస్టర్ గురించి. ఒక రేంజిలో ట్రోల్స్ పడ్డాయి.
ఇక మీమ్ క్రియేటర్లయితే తమ క్రియేటివిటీకి పదును పెట్టి బోలెడన్ని జోకులు, మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోసేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా పోస్టర్ గురించీ ఇంత రచ్చ జరగలేదంటే అతిశయోక్తి కాదు. తనకంటే పెద్ద స్టార్ల సినిమాలకు మించి ఈ పోస్టర్తో విజయ్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయగలిగాడన్నది వాస్తవం. చాలామంది విజయ్ ట్రోల్ అయ్యాడు అనుకుంటున్నారు కానీ.. అలా అయినా ‘లైగర్’ను డిస్కషన్లో పెట్టగలిగాడన్నది వాస్తవం.
ఈ రోజుల్లో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా.. సోషల్ మీడియాలో తమ సినిమా గురించి విడుదలకు ముందు చర్చ జరిగేలా చేసుకోవడం ముఖ్యం. ‘లైగర్’కు ఎందుకో గానీ ఇప్పటి వరకు అయితే సరైన బజ్ క్రియేట్ అవ్వలేదు. దీని ప్రోమోలు అంతగా ఆసక్తి రేకెత్తించలేదు. పైగా సినిమా చాలా చాలా ఆలస్యం అయింది. వచ్చే నెలలోనే ‘లైగర్’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రమోషన్ల పరంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యూహాత్మకంగానే ఈ న్యూడ్ పోస్టర్ లాంచ్ చేసినట్లున్నారు.
‘అర్జున్ రెడ్డి’ దగ్గర నుంచే బోల్డ్ ప్రోమోలకు విజయ్ పెట్టింది పేరు. కాబట్టి ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేయడంలో అతడికి పెద్ద అభ్యంతరాలేమీ లేకపోవచ్చు. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నాడు. మొత్తానికి ‘లైగర్’ టీం కోరుకున్న రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఒక్క పోస్టర్తో సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేటైంది. మరి మున్ముందు ప్రమోషన్ను విజయ్, పూరి కలిసి ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
This post was last modified on July 4, 2022 9:26 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…