నిన్న వదిలిన విజయ్ దేవరకొండ లైగర్ న్యూడ్ లుక్ సోషల్ మీడియాలో మాములు రచ్చ చేయలేదు. ఉద్దేశం ఏదైనా ఇలా నగ్నంగా ఫోజులు ఇవ్వడం పట్ల నెటిజెన్లు గట్టిగానే కౌంటర్లిచ్చారు. మరోవైపు సమంతా లాంటి వాళ్ళ మద్దతు దొరికినప్పటికీ ఫైనల్ గా ఆన్ లైన్ ట్రోలింగ్ లోని సీరియస్ నెస్ టీమ్ కి అర్థమైపోయింది. దెబ్బకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీల్లో బరువు కొలిచేందుకు ఇలా బట్టలు లేకుండా నిలబెడతారని అందుకే ఈ స్టిల్ అందులో భాగమని చెప్పుకొచ్చారు.
వినడానికి బాగానే ఉంది కానీ ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అవుతోంది లైగర్ టీమ్. ఉదాహరణకు చాలా జైళ్లల్లో శిక్ష పడ్డ ఖైదీకి తెల్ల దుస్తులు ఇచ్చే ముందు నగ్నంగా చెకింగ్ జరుగుతుంది. అల్లరి నరేష్ నాందిలో చూపించారు కూడా. కాకపోతే మరీ ఓపెన్ గా కాకుండా జాగ్రత్త పడ్డారు. అలా అని దాన్నే హైలైట్ చేస్తూ పబ్లిసిటీ చేయలేదు. మరో ఎగ్జాంపుల్ తీసుకుంటే హీరోకు శోభనం సీన్ ఉందంటే నేరుగా ప్రకృతి కార్యాన్ని చూపించలేరుగా. వెబ్ సిరీస్ లలో ఏమో కానీ సినిమాల్లో మాత్రం తలుపేసినట్టు చూపించి కట్ చేస్తారు.
అలాంటప్పుడు సహజత్వం కోసమే ఇలా చేశామని లైగర్ చెప్పడంలో సహేతుకమైన కారణం ఉన్నప్పటికీ అంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలో ఇదే దొరికిందా అంటూ యాంటీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంటే మైక్ టైసన్ ది కూడా ఇలాంటి పోస్టరే వదులుతారా అని డిమాండ్ చేస్తున్నారు. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన అల్టిమేట్ బాక్సింగ్ మూవీ రాకీకి సైతం ఈ తరహా పబ్లిసిటీ లేదన్నది వాళ్ళ వెర్షన్. ఏది ఏమైనా లైగర్ కోరుకున్న ప్రమోషన్ ఫుల్ గా వచ్చేసింది. ఇదే ఇలా ఉంటే టీజర్ ట్రైలర్లు నెక్స్ట్ లెవెల్ లో వస్తాయేమో
This post was last modified on July 3, 2022 2:17 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…