ఆ మధ్య విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ సినిమా ఇదే అంటూ ఊదరగొట్టారు. కానీ ‘పుష్ప’ రిలీజ్ కి ముందు తీసుకున్న రెండు భాగాల నిర్ణయంతో విజయ్ సినిమాను పక్కన పెట్టేశాడు సుక్కు. విజయ్ కూడా పూరితో రెండు సినిమాలు , మైత్రి లో ఓ సినిమాతో బిజీ అయిపోయాడు. అయితే ఈ కాంబో ప్రాజెక్ట్ అసలు ఉంటుందా ? లేదా అనే ప్రశ్న ఇప్పుడు మూవీ లవర్స్ లో కలుగుతుంది.
సుక్కు హీరోలని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు ఏ దర్శకుడూ చూపించని విధంగా హీరోని చూపిస్తాడు. అందుకే విజయ్ తో సినిమా ప్రకటన రాగానే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో ఇప్పుడు తమ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. నిజానికి విజయ్ సినిమాకు సంబంధించి సుక్కు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఒక లైన్ ఒకే అనుకున్నారు అంతే స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు.
ప్రస్తుతం సుక్కు తన ఫోకస్ అంతా ‘పుష్ప ది రూల్’ మీదే పెట్టాడు. పార్ట్ 1 తో వచ్చిన భారీ క్రేజ్ తో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. త్వరలోనే పుష్ప 2 షూట్ మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సుక్కు ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సుక్కు లిస్టులో ఇంకో భారీ ప్రాజెక్ట్ కూడా ఉందని అంటున్నారు. మరి సుకుమార్ ‘పుష్ప 2’ తర్వాత ముందుగా ఎనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ సినిమానే మొదలు పెడతాడా ? లేదా బిగ్ స్టార్ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతాడా తెలియాలంటే సుక్కు నుండి కానీ విజయ్ నుండి గానీ ఏదైనా అప్డేట్ రావలసిందే. లేదా ప్రొడక్షన్ హౌజ్ అయినా క్లారిటీ ఇవ్వాలి.
This post was last modified on July 2, 2022 6:12 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…