ఆ మధ్య విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ‘పుష్ప’ తర్వాత సుకుమార్ సినిమా ఇదే అంటూ ఊదరగొట్టారు. కానీ ‘పుష్ప’ రిలీజ్ కి ముందు తీసుకున్న రెండు భాగాల నిర్ణయంతో విజయ్ సినిమాను పక్కన పెట్టేశాడు సుక్కు. విజయ్ కూడా పూరితో రెండు సినిమాలు , మైత్రి లో ఓ సినిమాతో బిజీ అయిపోయాడు. అయితే ఈ కాంబో ప్రాజెక్ట్ అసలు ఉంటుందా ? లేదా అనే ప్రశ్న ఇప్పుడు మూవీ లవర్స్ లో కలుగుతుంది.
సుక్కు హీరోలని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు ఏ దర్శకుడూ చూపించని విధంగా హీరోని చూపిస్తాడు. అందుకే విజయ్ తో సినిమా ప్రకటన రాగానే దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో ఇప్పుడు తమ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. నిజానికి విజయ్ సినిమాకు సంబంధించి సుక్కు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు. ఒక లైన్ ఒకే అనుకున్నారు అంతే స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు.
ప్రస్తుతం సుక్కు తన ఫోకస్ అంతా ‘పుష్ప ది రూల్’ మీదే పెట్టాడు. పార్ట్ 1 తో వచ్చిన భారీ క్రేజ్ తో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. త్వరలోనే పుష్ప 2 షూట్ మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సుక్కు ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. సుక్కు లిస్టులో ఇంకో భారీ ప్రాజెక్ట్ కూడా ఉందని అంటున్నారు. మరి సుకుమార్ ‘పుష్ప 2’ తర్వాత ముందుగా ఎనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ సినిమానే మొదలు పెడతాడా ? లేదా బిగ్ స్టార్ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిపోతాడా తెలియాలంటే సుక్కు నుండి కానీ విజయ్ నుండి గానీ ఏదైనా అప్డేట్ రావలసిందే. లేదా ప్రొడక్షన్ హౌజ్ అయినా క్లారిటీ ఇవ్వాలి.
This post was last modified on July 2, 2022 6:12 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…