చాలా కాలం రీసెర్చ్ చేసి భారీ బడ్జెట్ తో మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. హిందీతో పాటు తెలుగు తమిళం ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఎవరూ లేకపోవడంతో అంతా తానై ప్రమోషన్ ని నడిపించారు మాధవన్. షారుఖ్ ఖాన్ – సూర్యలు చేసిన క్యామియోలను అతిగా మార్కెటింగ్ చేసుకోకుండా నిజాయితీగా చేసిన ప్రయత్నమని జనంలోకి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ప్రీమియర్లకు మంచి స్పందన కనిపించింది.
పద్మభూషణ్ అందుకున్న శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఇది. తప్పుడు కేసులో జైలుకు వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనం. భారతీయ రాకెట్ పరిశోధనకు సంబంధించిన కొన్ని పత్రాలను శత్రుదేశానికి అందించాడనే అభియోగం మీద నంబి కటకటాల పాలవుతారు. యాభై రోజులు కారాగారంలో ఉండి బయటికి వచ్చాక అసలు దోషుల కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఈ యజ్ఞంలో ఎలా విజయం సాధించారు, అసలు ఆయన్ను ఇరికించిన ఆ ముష్కరులు ఎవరనే పాయింట్ మీద రాకెట్రీ సాగుతుంది.
ఇది నిజంగానే సిన్సియర్ బయోపిక్. ప్రతి ఫ్రేమ్ లో మాధవన్ కష్టం కనిపిస్తుంది.ఒకప్పుడు పరవశం, అమృత లాంటి చిత్రాల్లో అతనికి జోడిగా నటించిన సిమ్రాన్ ఇందులోనూ భార్య పాత్ర పోషించారు.ఇలాంటి కథలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం పెద్ద ఛాలెంజ్. టీమ్ ఎంత కష్టపడినప్పటికీ డ్రామాపాలు తగ్గిపోయి స్క్రీన్ ప్లే నెమ్మదించడంతో చాలా ఓపిగ్గా సినిమాను చూడాల్సి ఉంటుంది. నంబి పడిన కష్ఠాలు కళ్ళకు కట్టినట్టు చూపించే క్రమంలో ఎక్కువ డిటైలింగ్ కు వెళ్లారు. ఫలితంగా కామన్ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవ్వడం కష్టమే. బోలెడు అవార్డులు రివార్డులకు సంపూర్ణ అర్హత కలిగిన రాకెట్రీ కమర్షియల్ గా చేసే అద్భుతాలు అనుమానమే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…