టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు పెద్ద పెద్ద హిట్లిచ్చాడు పూరి జగన్నాథ్. చిన్నా చితకా వేషాలు వేసుకుంటున్న రవితేజ అనే నటుడు హీరోగా నిలదొక్కుకుని స్టార్గా ఎదిగాడంటే అది పూరి పుణ్యమే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల కెరీర్లు మరో స్థాయికి వెళ్లడానికి పూరి కారణం అనడంలో సందేహం లేదు. ఇంకా మరికొందరు హీరోలకు కెరీర్లో మరిచిపోలేని సినిమాలిచ్చాడు పూరి. అలాంటిది తన కొడుకు పూరి ఆకాష్ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు.
బాల నటుడిగా తన సినిమాల్లో అతణ్ని బాగానే ప్రమోట్ చేశాడు కానీ.. ఇంకా టీనేజీలో ఉండగానే ‘ఆంధ్రా పోరి’ అనే సినిమా చేయించడం పెద్ద మిస్టేక్. తర్వాత కొన్నేళ్లకు తన దర్శకత్వంలో ‘మెహబూబా’ అనే పేలవమైన సినిమా చేయించడం ఇంకా పెద్ద మిస్టేక్. తాను పేలవ ఫాంలో ఉన్న టైంలో కొడుకును హీరో చేయాల్సి రావడం పూరి దురదృష్టం.
ఆ తర్వాత వేరే దర్శకులకు అప్పగించినా ఫలితం లేకపోయింది. వాళ్లు తీసిన సినిమాలతో పోలిస్తే పూరి తీసిన చిత్రమే నయం అనుకునే పరిస్థితి. గత ఏడాది వచ్చిన ‘రొమాంటిక్’ ఫ్లాప్ అయినా.. ఆకాష్ బాగా చేశాడనే పేరైనా తెచ్చింది. కొంతమేర యూత్ను అయినా ఆ సినిమా ఆకర్షించింది. కానీ ఇటీవలే రిలీజైన ఆకాష్ సినిమా ‘చోర్ బజార్’ అయితే మరీ ఘోరం. ఈ సినిమాలోచెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ లేదు. ఇంత పేలవమైన సినిమాను ఆకాష్ ఎలా ఒప్పుకున్నాడో, పూరి ఎలా దీన్ని ఓకే చేశాడో అర్థం కాని పరిస్థితి.
ఈ సినిమా చూసిన చాలామంది.. ఆకాష్ హీరోగా నిలదొక్కుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. అరంగేట్రానికి ముందే బంపర్ క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ సైతం వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చాక కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదనిపించినా కూడా ఇంకా కూడా నెగెటివిటీని అధిగమించలేకపోతున్నాడు. కెరీర్ ఏమాత్రం ఊపందుకుంటుందో అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. అలాంటిది ఆకాష్ ఇక పుంజుకోగలడా.. ‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు హీరోగా నిలదొక్కుకుని తండ్రి గర్వించేలాగా చేయగలడా అన్నది చూడాలి.
This post was last modified on June 30, 2022 10:06 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…