టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు పెద్ద పెద్ద హిట్లిచ్చాడు పూరి జగన్నాథ్. చిన్నా చితకా వేషాలు వేసుకుంటున్న రవితేజ అనే నటుడు హీరోగా నిలదొక్కుకుని స్టార్గా ఎదిగాడంటే అది పూరి పుణ్యమే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల కెరీర్లు మరో స్థాయికి వెళ్లడానికి పూరి కారణం అనడంలో సందేహం లేదు. ఇంకా మరికొందరు హీరోలకు కెరీర్లో మరిచిపోలేని సినిమాలిచ్చాడు పూరి. అలాంటిది తన కొడుకు పూరి ఆకాష్ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు.
బాల నటుడిగా తన సినిమాల్లో అతణ్ని బాగానే ప్రమోట్ చేశాడు కానీ.. ఇంకా టీనేజీలో ఉండగానే ‘ఆంధ్రా పోరి’ అనే సినిమా చేయించడం పెద్ద మిస్టేక్. తర్వాత కొన్నేళ్లకు తన దర్శకత్వంలో ‘మెహబూబా’ అనే పేలవమైన సినిమా చేయించడం ఇంకా పెద్ద మిస్టేక్. తాను పేలవ ఫాంలో ఉన్న టైంలో కొడుకును హీరో చేయాల్సి రావడం పూరి దురదృష్టం.
ఆ తర్వాత వేరే దర్శకులకు అప్పగించినా ఫలితం లేకపోయింది. వాళ్లు తీసిన సినిమాలతో పోలిస్తే పూరి తీసిన చిత్రమే నయం అనుకునే పరిస్థితి. గత ఏడాది వచ్చిన ‘రొమాంటిక్’ ఫ్లాప్ అయినా.. ఆకాష్ బాగా చేశాడనే పేరైనా తెచ్చింది. కొంతమేర యూత్ను అయినా ఆ సినిమా ఆకర్షించింది. కానీ ఇటీవలే రిలీజైన ఆకాష్ సినిమా ‘చోర్ బజార్’ అయితే మరీ ఘోరం. ఈ సినిమాలోచెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ లేదు. ఇంత పేలవమైన సినిమాను ఆకాష్ ఎలా ఒప్పుకున్నాడో, పూరి ఎలా దీన్ని ఓకే చేశాడో అర్థం కాని పరిస్థితి.
ఈ సినిమా చూసిన చాలామంది.. ఆకాష్ హీరోగా నిలదొక్కుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. అరంగేట్రానికి ముందే బంపర్ క్రేజ్ తెచ్చుకున్న అఖిల్ సైతం వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చాక కెరీర్ బాగా డౌన్ అయిపోయింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదనిపించినా కూడా ఇంకా కూడా నెగెటివిటీని అధిగమించలేకపోతున్నాడు. కెరీర్ ఏమాత్రం ఊపందుకుంటుందో అన్న సందేహాలు కొనసాగుతున్నాయి. అలాంటిది ఆకాష్ ఇక పుంజుకోగలడా.. ‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు హీరోగా నిలదొక్కుకుని తండ్రి గర్వించేలాగా చేయగలడా అన్నది చూడాలి.
This post was last modified on June 30, 2022 10:06 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…