Movie News

రూల్ పెట్టారు సరే.. ఫాలో అవుతారా?

టాలీవుడ్ ఓటీటీల్లో కొత్త సినిమాలను రిలీజ్ చేసే విషయంలో కఠిన వైఖరి అవలంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేందుకు 50 రోజుల విరామం ఉండాలని టాలీవుడ్ అగ్ర నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. ప్రొడ్యూసర్ గిల్డ్‌లో ఈ మేరకు నిర్ణయం జరగబోతున్నట్లు మొన్న బన్నీ వాసు పేర్కొనగా.. తర్వాతి రోజు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

జులై 1 నుంచి కొత్తగా ఓటీటీ అగ్రిమెంట్ జరిగే ప్రతి సినిమాకూ ఈ షరతు వర్తిస్తుందని, తమతో సహా అందరం దీనికి కట్టుబడి ఉండాల్సిందే అని రవిశంకర్ స్పష్టం చేశారు. మైత్రీ సంస్థ నుంచి వచ్చిన సర్కారు వారి పాట, అంటే సుందరానికీ చిత్రాలను అటు ఇటుగా నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ చేయడం, అంతకుముందు ‘ఆచార్య’ మూవీ మూడు వారాలకే ప్రైమ్‌లోకి వచ్చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

మరీ ఇంత త్వరగా కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తే.. ఇక ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, దీర్ఘ కాలంలో ఇది చాలా నష్టం చేస్తుందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఐతే ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ.. ఈ షరతును అందరూ పాటిస్తారా అన్నది సందేహం. ఓటీటీలు 50 రోజుల తర్వాత సినిమాను రిలీజ్ చేస్తే అంత క్రేజ్, హైప్ ఉండదు. వారికి దక్కాల్సిన ప్రయోజనం దక్కకపోవచ్చు.

ఈ రోజుల్లో ఒకట్రెండు వారాలకు మించి కొత్త సినిమాలు థియేటర్లలో నిలవట్లేదు. ఇక అప్పట్నుంచి జనాలు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లు ఆసక్తి కోల్పోకముందే సినిమాను ఓటీటీలోకి తేవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటీటీలు మంచి ఆఫర్లు ఇస్తుంటే నిర్మాతలు టెంప్ట్ అవకుండా ఉండలేరు. పెద్ద నిర్మాణ సంస్థల సంగతి పక్కన పెడితే.. చిన్న, మీడియం రేంజ్ చిత్రాలను నిర్మించే వాళ్లకు ఓటీటీ డీల్స్ చాలా ముఖ్యం. వాళ్లలో చాలామంది నిర్మాతలు దీర్ఘ కాలం సినిమాలు తీసేవాళ్లు అయి ఉండరు. వాళ్లకు ఇప్పుడు తీసే ఒకట్రెండు సినిమాలు ముఖ్యం. వాటి ద్వారా లభించే ఆదాయం కీలకం. వాళ్లంతా ఇండస్ట్రీకి దీర్ఘ కాలంలో జరిగే నష్టం గురించి ఆలోచించి ఈ షరతును అనుసరిస్తారా అన్నది డౌటు. అసలు పెద్ద నిర్మాతల్లో కూడా అందరూ దీనికి కట్టుబడి ఉంటారా అన్నదీ అనుమానమే.

This post was last modified on June 30, 2022 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

59 minutes ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

3 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

6 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

7 hours ago

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

8 hours ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

9 hours ago