గత శుక్రవారం లాగే ఇప్పుడు కూడా ఏకంగా ఎనిమిది సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగింది పక్కా కమర్షియల్ ఒకటే అయినప్పటికీ దానికీ అడ్వాన్స్ బుకింగ్స్ మరీ జోరుగా ఏం లేవు. టికెట్ రేట్ల తగ్గింపే ప్రమోషన్ మంత్రంగా గీతా ఆర్ట్స్ దీనికి మంచి పబ్లిసిటీనే ఇస్తోంది. మాస్ లో గోపీచంద్ ఇమేజ్, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు ఏ మేరకు ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతాయో జూలై 1న మార్నింగ్ షో పూర్తయ్యాక కాని క్లారిటీ రాదు. అప్పటిదాకా వేచి చూడాలి.
ఇక ఏనుగు టైటిల్ తో అరుణ్ విజయ్ డబ్బింగ్ మూవీ ఒకటొస్తోంది. సింగం సిరీస్ సృష్టికర్త హరి దర్శకుడు. ట్రైలర్ ఊర మాస్ గా అనిపించింది కానీ ఇది జనాన్ని ఏ మేరకు థియేటర్ కు రప్పిస్తుందో చూడాలి. మాధవన్ స్వీయ దర్శకత్వం వహించిన రాకెట్రీ మీద తెలుగులో ఏమంత బజ్ లేదు. మేజర్ రేంజ్ లో టాక్ వస్తేనే నిలదొక్కుకుంటుంది టెన్త్ క్లాస్ డైరీస్, హుషారు, ఏమైపోతావే, ఈవిల్ లైఫ్ అని ఇంకొన్ని చిన్న సినిమాలున్నాయి కానీ వీటికి కనీసం పాతిక శాతం ఆక్యుపెన్సీ వచ్చినా గొప్పే అనేలా ఉంది పరిస్థితి.
ఒక పక్క జనం థియేటర్లకు రావడం లేదని వాపోతున్న ఇండస్ట్రీ వర్గాలు ఇన్నేసి చిత్రాలు క్లాష్ అవ్వడం వల్ల ఓపెనింగ్స్ మీద పడే ప్రభావాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.ఏదో ఓటిటిలు కండీషన్ పెట్టాయి కదాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న మాట వాస్తవమే అయితే దీనికీ భవిష్యత్తులో ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. ప్రేక్షకులకు మరీ ఎక్కువ ఆప్షన్లు ఉన్నా చిక్కే. కన్ఫ్యూజన్ లో ఏదీ వద్దకునునే ప్రమాదం లేకపోలేదు. ఉన్నంతలో పక్కా కమర్షియల్ కే ఎక్కువ ఎడ్జ్ ఉంది కనక ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి
This post was last modified on June 30, 2022 9:05 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…