రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ ఇద్దరితోనూ నటించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. చరణ్తో ‘రచ్చ’ చేసిన ఆమె.. బన్నీ సరసన ‘బద్రీనాథ్’లో నటించింది. ఐతే ఈ ఇద్దరితో కలిసి మిల్కీ బ్యూటీ ఒకేసారి పని చేయబోతున్నట్లు తాజా సమాచారం. వాళ్లిద్దరితో కలిసి అంటే.. ‘ఎవడు’ తరహాలో మల్టీస్టారర్ ఏమైనా చేయబోతున్నారా అని ఆశ్చర్యపోకండి.
ఇది అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ కోసం ప్లాన్ చేస్తున్న టాక్ షోలో భాగమట. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్లతో సరిపెట్టకుండా తమ సబ్స్క్రైబర్లను మరింత ఎంగేజ్ చేసేందుకు కొన్ని టాక్ షోలను కూడా ‘ఆహా’ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తమన్నా లాంటి స్టార్ హీరోయిన్తో ఒక షోకు రంగం సిద్ధం చేస్తోంది. టాలీవుడ్ సెలబ్రెటీలతో ఇంతకుముందు టీవీల్లో చూసిన వాటికి భిన్నంగా ఈ టాక్ షోను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ షోకు హైప్ తెప్పించడం కోసం తొలి ఎపిసోడ్ను రామ్ చరణ్, అల్లు అర్జున్ జోడీలను అతిథులుగా రప్పిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజం అయితే బావ, బావమరుదులు కలయిక ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లలో అనుకోకుండా చరణ్, బన్నీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో బన్నీ వేరు, మెగా అభిమానుల్లో బన్నీ అభిమానులు వేరు అన్నట్లుగా తయారైంది. ఇంతకుముందులా చరణ్తో అంతగా అసోసియేట్ కావడానికి బన్నీ ఇష్టపడట్లేదనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో చరణ్తో కలిసి బన్నీ ఈ షోలో కనిపించాడంటే దానిపై అందరి దృష్టీ నిలిచి ఉంటుంది. ఈ షోకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. అరవింద్ నిజంగా అనుకుంటే వీళ్లిద్దరితో కలిసి షో చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ జోడీని నిజంగానే ‘ఆహా’ షోలో చూస్తామో లేదో చూడాలి మరి.
This post was last modified on June 29, 2020 10:02 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…