కొన్నేళ్లుగా హిట్టు లేకుండా బండి నడిపిస్తున్న హీరోల లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు గోపీచంద్. అవును మ్యాచో హీరోకి దాదాపు ఏడెనిమిదేళ్ళుగా సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో జిల్ తో ఓ హిట్టు కొట్టాడు తర్వాత ఎన్ని సినిమాలు తీసినా, ప్రయోగాలు చేసినా హిట్ కొట్టలేకపోయాడు.
నిజానికి ‘సాహసం’ థియేటర్స్ ఆడలేదు కానీ టివీలో బాగానే చూశారు. ఆ తర్వాత ‘ఆక్సిజన్’, ‘పంతం’,’గౌతమ్ నంద’,’చాణక్య’ ఇలా ఎన్ని సినిమాలు చేసిన ఒక్కటి కూడా గోపీచంద్ ని హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఆఖరికి ‘సీటిమార్’ కూడా గోపిచంద్ కి ఆశించిన విజయం అందించలేకపోయింది.
అందుకే ఇప్పుడు అన్నీ ఆశలు ‘పక్కా కమర్షియల్’ మీదే పెట్టుకున్నాడు మ్యాచో స్టార్. మారుతి తనని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి బౌన్స్ బ్యాక్ చేస్తాడని ఆశిస్తున్నాడు. నిజానికి పక్కా కమర్షియల్ ప్రారంభంలో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
‘ప్రతి రోజు పండగే’ వంటి సూపర్ హిట్ తర్వాత మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ పరంగా కూడా క్రేజ్ దక్కించుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ అనే నాసిరకం సినిమా చేసి చేయి కాల్చుకున్నాడు. ఆ సినిమా ఘోరంగా అపజయం అందుకుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పక్కా కమర్షియల్ మీద పడింది.
తాజాగా చిరంజీవి ఈవెంట్ కి రావడంతో కొంత బజ్ వచ్చింది. పైగా మేకర్స్ టికెట్టు ధర బాగా తగ్గించి ఒకప్పటి రెట్లు తీసుకొచ్చారు. ఏ మాత్రం టాక్ బాగున్నా థియేటర్స్ కి జనాలు క్యూ కట్టడం ఖాయం. మారుతీ మార్క్ కామెడీ క్లిక్ అయితే సినిమా మంచి రెవెన్యూ చేయడం పక్కా.
మరి గోపీచంద్ హిట్ కొట్టడానికి అన్ని కలిసొచ్చాయి. మరి ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ తన మార్కెట్ పెంచుకుంటాడా చూడాలి. నెక్స్ట్ శ్రీవాస్ తో గోపీచంద్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఆ సినిమా మార్కెట్ కూడా ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ మీద ఆధారపడి ఉంది.
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…