కొన్నేళ్లుగా హిట్టు లేకుండా బండి నడిపిస్తున్న హీరోల లిస్టులో ముందు వరుసలో ఉన్నాడు గోపీచంద్. అవును మ్యాచో హీరోకి దాదాపు ఏడెనిమిదేళ్ళుగా సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో జిల్ తో ఓ హిట్టు కొట్టాడు తర్వాత ఎన్ని సినిమాలు తీసినా, ప్రయోగాలు చేసినా హిట్ కొట్టలేకపోయాడు.
నిజానికి ‘సాహసం’ థియేటర్స్ ఆడలేదు కానీ టివీలో బాగానే చూశారు. ఆ తర్వాత ‘ఆక్సిజన్’, ‘పంతం’,’గౌతమ్ నంద’,’చాణక్య’ ఇలా ఎన్ని సినిమాలు చేసిన ఒక్కటి కూడా గోపీచంద్ ని హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఆఖరికి ‘సీటిమార్’ కూడా గోపిచంద్ కి ఆశించిన విజయం అందించలేకపోయింది.
అందుకే ఇప్పుడు అన్నీ ఆశలు ‘పక్కా కమర్షియల్’ మీదే పెట్టుకున్నాడు మ్యాచో స్టార్. మారుతి తనని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి బౌన్స్ బ్యాక్ చేస్తాడని ఆశిస్తున్నాడు. నిజానికి పక్కా కమర్షియల్ ప్రారంభంలో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
‘ప్రతి రోజు పండగే’ వంటి సూపర్ హిట్ తర్వాత మారుతీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ పరంగా కూడా క్రేజ్ దక్కించుకుంది. కానీ ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో మారుతి ‘మంచి రోజులొచ్చాయి’ అనే నాసిరకం సినిమా చేసి చేయి కాల్చుకున్నాడు. ఆ సినిమా ఘోరంగా అపజయం అందుకుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పక్కా కమర్షియల్ మీద పడింది.
తాజాగా చిరంజీవి ఈవెంట్ కి రావడంతో కొంత బజ్ వచ్చింది. పైగా మేకర్స్ టికెట్టు ధర బాగా తగ్గించి ఒకప్పటి రెట్లు తీసుకొచ్చారు. ఏ మాత్రం టాక్ బాగున్నా థియేటర్స్ కి జనాలు క్యూ కట్టడం ఖాయం. మారుతీ మార్క్ కామెడీ క్లిక్ అయితే సినిమా మంచి రెవెన్యూ చేయడం పక్కా.
మరి గోపీచంద్ హిట్ కొట్టడానికి అన్ని కలిసొచ్చాయి. మరి ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ తన మార్కెట్ పెంచుకుంటాడా చూడాలి. నెక్స్ట్ శ్రీవాస్ తో గోపీచంద్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఆ సినిమా మార్కెట్ కూడా ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ మీద ఆధారపడి ఉంది.
This post was last modified on June 29, 2022 9:29 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…