Movie News

థియేటర్లలో తుస్.. ఓటీటీలో భేష్

అజయ్ దేవగణ్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. కరోనాకు ముందు విడుదలైన అజయ్ చివరి సినిమా ‘తానాజీ’ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాకు అది బాగా కలిసొస్తుందని అనుకున్నారు. అందుకేనేమో.. తర్వాతి చిత్రాన్ని వేరే వాళ్లకు చేయకుండా స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో ‘రన్ వే 34’ను రూపొందించాడు.

ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ ఎయిర్ థ్రిల్లర్.. రెండు నెలల కిందట థియేటర్లలోకి దిగింది. సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ వసూళ్లలో మాత్రం అది ప్రతిఫలించలేదు. తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.20 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. చాన్నాళ్లు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇలాంటి ఫలితం వచ్చేసరికి అజయ్ అండ్ టీం షాకైపోయింది.

ఐతే ఈ మధ్య చాలా హిందీ సినిమాల విషయంలో జరుగుతున్నదేంటంటే.. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతోంది. ‘రన్ వే 34’ కూడా ఆ జాబితాలోనే చేరింది. అమేజాన్ ప్రైమ్‌లో ముందు ఈ చిత్రాన్ని రెంట్ ఆప్షన్‌తో రిలీజ్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరికీ చూసే అవకాశం కల్పించారు. అప్పట్నుంచి ‘రన్ వే 34’కు రెస్పాన్స్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఓ కొత్త సినిమా రిలీజైనట్లు దీని గురించి పోస్టులు పెడుతున్నారు. రిలీజైన దగ్గర్నుంచి ప్రైమ్‌లో ఇదే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అందులో సినిమా చూసిన వాళ్లు థియేటర్లలో ఎందుకు ఆడలేదో అని ఆశ్చర్యపోతున్నారు.

క్రేజీ, మాస్ కంటెంట్ ఉంటేనే ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ టైంలో పట్టించుకోకపోవడం.. సినిమా ఏదో నామమాత్రంగా ఆడేసి ఓటీటీల్లోకి వచ్చాక చూసి ఈ సినిమా భలే ఉందే సోషల్ మీడియాలో కొనియాడడం మామూలైపోయింది. తెలుగులో ఈ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం విషయంలోనూ ఇలాంటి స్పందనే కనిపించింది.

This post was last modified on June 29, 2022 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

8 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

9 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

10 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

10 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

10 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

11 hours ago