అజయ్ దేవగణ్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. కరోనాకు ముందు విడుదలైన అజయ్ చివరి సినిమా ‘తానాజీ’ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాకు అది బాగా కలిసొస్తుందని అనుకున్నారు. అందుకేనేమో.. తర్వాతి చిత్రాన్ని వేరే వాళ్లకు చేయకుండా స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో ‘రన్ వే 34’ను రూపొందించాడు.
ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ ఎయిర్ థ్రిల్లర్.. రెండు నెలల కిందట థియేటర్లలోకి దిగింది. సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ వసూళ్లలో మాత్రం అది ప్రతిఫలించలేదు. తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.20 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. చాన్నాళ్లు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇలాంటి ఫలితం వచ్చేసరికి అజయ్ అండ్ టీం షాకైపోయింది.
ఐతే ఈ మధ్య చాలా హిందీ సినిమాల విషయంలో జరుగుతున్నదేంటంటే.. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతోంది. ‘రన్ వే 34’ కూడా ఆ జాబితాలోనే చేరింది. అమేజాన్ ప్రైమ్లో ముందు ఈ చిత్రాన్ని రెంట్ ఆప్షన్తో రిలీజ్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఫ్రీగా సబ్స్క్రైబర్లందరికీ చూసే అవకాశం కల్పించారు. అప్పట్నుంచి ‘రన్ వే 34’కు రెస్పాన్స్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఓ కొత్త సినిమా రిలీజైనట్లు దీని గురించి పోస్టులు పెడుతున్నారు. రిలీజైన దగ్గర్నుంచి ప్రైమ్లో ఇదే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అందులో సినిమా చూసిన వాళ్లు థియేటర్లలో ఎందుకు ఆడలేదో అని ఆశ్చర్యపోతున్నారు.
క్రేజీ, మాస్ కంటెంట్ ఉంటేనే ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ టైంలో పట్టించుకోకపోవడం.. సినిమా ఏదో నామమాత్రంగా ఆడేసి ఓటీటీల్లోకి వచ్చాక చూసి ఈ సినిమా భలే ఉందే సోషల్ మీడియాలో కొనియాడడం మామూలైపోయింది. తెలుగులో ఈ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం విషయంలోనూ ఇలాంటి స్పందనే కనిపించింది.
This post was last modified on June 29, 2022 10:49 am
సినిమా థియేటర్లలో జనం కనిపించడం లేదనేది ఇప్పుడు ఇండస్ట్రీని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సినిమా బాగుంటే వేరే సంగతి, కానీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మిగతా భాషల సినిమాలన్నీ తమ డేట్స్ మార్చుకునే…
ఈ మధ్య కాలంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే ఉత్సాహంతో 'గెట్ టు గెదర్' పార్టీలు చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది.…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ…
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…