ఒకప్పుడైనా, ఇప్పుడైనా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఈ జాబితాలో చాలా తక్కువమందే కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో ఇలా వచ్చి నిలబడ్డ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. అతడి తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుని అతడికి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత తనే రచయితగా మారి, మేకింగ్ విషయంలోనూ అన్నీ తానై వ్యవహరిస్తూ చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ యువత దృష్టిని బాగానే ఆకర్షించింది. సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని కిరణ్కు యూత్లో ఉన్న ఫాలోయింగ్ను చాటిచెప్పింది. ఈ సినిమా సాధించిన సక్సెస్ చూసే గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు అతడికి అవకాశాలు ఇచ్చాయి. తాజాగా కిరణ్ నుంచి ‘సమ్మతమే’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడం విశేషం.
ఐతే ‘సమ్మతమే’కు, అంతకుముందు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ఇవి రెండూ ప్రేక్షకులను సంతృప్తిపరచలేకపోయాయి. బ్యాగ్రౌండ్ లేకుండా, చిన్న సినిమాతో హీరో అయిన కిరణ్కు ఈ మాత్రం ఓపెనింగ్స్ వస్తున్నాయంటే గొప్ప విషయమే.
అతడిలో టాలెంట్ ఉంది, యూత్కు అతను బాగా కనెక్ట్ అవుతున్నాడన్నది వాస్తవం. కానీ కథల ఎంపికలో అతడి జడ్జిమెంటే బాగా లేదన్నది అందరూ అంటున్న మాట. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కాన్సెప్ట్, కొన్ని ఎపిసోడ్ల వరకు బాగున్నా.. మొత్తంగా ఆ సినిమాను సరిగా డీల్ చేయలేదు. ఇక తర్వాత కిరణ్ చేసిన ‘సెబాస్టియన్’ అయితే మరీ పేలవమైన సినిమా.
‘సమ్మతమే’ కూడా కొంత వరకు బాగున్నా.. మొత్తంగా చూస్తే బలమైన కంటెంట్ ఉన్న చిత్రం కాదు. ఎక్కువగా అనుభవం లేని దర్శకులు, నిర్మాతలతో పని చేస్తున్న కిరణ్కు.. సరైన గైడెన్స్ కరవవుతోందన్నది స్పష్టం. ఐతే ఇప్పుడు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లలో చేస్తున్నాడు కాబట్టి అతడికి ఆ గైడెన్స్ దొరుకుతుందనే ఆశిద్దాం. అడివి శేష్ లాగా రైటింగ్ టాలెంట్ కూడా ఉన్న ఈ యంగ్ హీరో.. కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే స్టార్ అయ్యే లక్షణాలున్నాయి. మరి చేతిలో ఉన్న అవకాశాలను అతను ఎంతమేర ఉపయోగించుకుంటాడో చూడాలి.
This post was last modified on June 28, 2022 7:41 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…