దక్షిణాది పాటల రీచ్ చూసి ఇప్పుడు ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మన పాటలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. గత కొన్నేళ్లలో వచ్చిండే, బుట్టబొమ్మా, సామజవరగమనా, సారంగ దరియా, రౌడీ బేబీ లాంటి పాటలు ఇంటర్నెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. వాటికి యూట్యూబ్లో ఎంత భారీ వ్యూస్, లైక్స్ వచ్చాయో తెలిసిందే. ఇక గత కొన్ని నెలల్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన పాటల్లో ‘ఊ అంటావా’ ఒకటి.
ముందు విన్నపుడు ఈ పాట మామూలుగానే అనిపించింది కానీ.. తర్వాత తర్వాత అది జనాలకు పిచ్చెక్కించేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఆ పాటను హమ్ చేయడం, ఆ ట్యూన్కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. హిందీలోనూ ‘పుష్ప’ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో ఈ పాట రీచ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.
ఉత్తరాదిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ ‘ఊ అంటావా’ పిచ్చి ఎక్కేసింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోవడం విశేషం. తాజాగా ఓ అవార్డుల వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, ఇన్స్పైర్ చేసిన పాట ఏది అని సల్మాన్ ఖాన్ను అడిగితే.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశాడు సల్మాన్.
ఇలా ఓ తెలుగు పాట లిరిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట ఆయన ఫేవరెట్గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ పాట ఏ స్థాయిలో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ నోట తన పాట వినిపించేసరికి సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విటర్లో ఈ పోస్టుకు బదులుగా లవ్ ఇమోజీలు పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘పుష్ప-2’లో కూడా ఇలాంటి పాట ఒకటి పడితే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on June 27, 2022 6:24 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…