దక్షిణాది పాటల రీచ్ చూసి ఇప్పుడు ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మన పాటలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. గత కొన్నేళ్లలో వచ్చిండే, బుట్టబొమ్మా, సామజవరగమనా, సారంగ దరియా, రౌడీ బేబీ లాంటి పాటలు ఇంటర్నెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. వాటికి యూట్యూబ్లో ఎంత భారీ వ్యూస్, లైక్స్ వచ్చాయో తెలిసిందే. ఇక గత కొన్ని నెలల్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన పాటల్లో ‘ఊ అంటావా’ ఒకటి.
ముందు విన్నపుడు ఈ పాట మామూలుగానే అనిపించింది కానీ.. తర్వాత తర్వాత అది జనాలకు పిచ్చెక్కించేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఆ పాటను హమ్ చేయడం, ఆ ట్యూన్కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. హిందీలోనూ ‘పుష్ప’ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో ఈ పాట రీచ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.
ఉత్తరాదిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ ‘ఊ అంటావా’ పిచ్చి ఎక్కేసింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోవడం విశేషం. తాజాగా ఓ అవార్డుల వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, ఇన్స్పైర్ చేసిన పాట ఏది అని సల్మాన్ ఖాన్ను అడిగితే.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశాడు సల్మాన్.
ఇలా ఓ తెలుగు పాట లిరిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట ఆయన ఫేవరెట్గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ పాట ఏ స్థాయిలో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ నోట తన పాట వినిపించేసరికి సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విటర్లో ఈ పోస్టుకు బదులుగా లవ్ ఇమోజీలు పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘పుష్ప-2’లో కూడా ఇలాంటి పాట ఒకటి పడితే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on June 27, 2022 6:24 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…