దక్షిణాది పాటల రీచ్ చూసి ఇప్పుడు ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మన పాటలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. గత కొన్నేళ్లలో వచ్చిండే, బుట్టబొమ్మా, సామజవరగమనా, సారంగ దరియా, రౌడీ బేబీ లాంటి పాటలు ఇంటర్నెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. వాటికి యూట్యూబ్లో ఎంత భారీ వ్యూస్, లైక్స్ వచ్చాయో తెలిసిందే. ఇక గత కొన్ని నెలల్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన పాటల్లో ‘ఊ అంటావా’ ఒకటి.
ముందు విన్నపుడు ఈ పాట మామూలుగానే అనిపించింది కానీ.. తర్వాత తర్వాత అది జనాలకు పిచ్చెక్కించేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఆ పాటను హమ్ చేయడం, ఆ ట్యూన్కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. హిందీలోనూ ‘పుష్ప’ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో ఈ పాట రీచ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.
ఉత్తరాదిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ ‘ఊ అంటావా’ పిచ్చి ఎక్కేసింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోవడం విశేషం. తాజాగా ఓ అవార్డుల వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, ఇన్స్పైర్ చేసిన పాట ఏది అని సల్మాన్ ఖాన్ను అడిగితే.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశాడు సల్మాన్.
ఇలా ఓ తెలుగు పాట లిరిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట ఆయన ఫేవరెట్గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ పాట ఏ స్థాయిలో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ నోట తన పాట వినిపించేసరికి సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విటర్లో ఈ పోస్టుకు బదులుగా లవ్ ఇమోజీలు పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘పుష్ప-2’లో కూడా ఇలాంటి పాట ఒకటి పడితే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on June 27, 2022 6:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…