దక్షిణాది పాటల రీచ్ చూసి ఇప్పుడు ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇంటర్నెట్ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మన పాటలను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. గత కొన్నేళ్లలో వచ్చిండే, బుట్టబొమ్మా, సామజవరగమనా, సారంగ దరియా, రౌడీ బేబీ లాంటి పాటలు ఇంటర్నెట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. వాటికి యూట్యూబ్లో ఎంత భారీ వ్యూస్, లైక్స్ వచ్చాయో తెలిసిందే. ఇక గత కొన్ని నెలల్లో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిన పాటల్లో ‘ఊ అంటావా’ ఒకటి.
ముందు విన్నపుడు ఈ పాట మామూలుగానే అనిపించింది కానీ.. తర్వాత తర్వాత అది జనాలకు పిచ్చెక్కించేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఆ పాటను హమ్ చేయడం, ఆ ట్యూన్కు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. హిందీలోనూ ‘పుష్ప’ సినిమా బ్లాక్బస్టర్ కావడంతో ఈ పాట రీచ్ అసాధారణ స్థాయికి చేరుకుంది.
ఉత్తరాదిన సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ ‘ఊ అంటావా’ పిచ్చి ఎక్కేసింది. చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ‘ఊ అంటావా’ మాయలో పడిపోవడం విశేషం. తాజాగా ఓ అవార్డుల వేడుక సందర్భంగా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, ఇన్స్పైర్ చేసిన పాట ఏది అని సల్మాన్ ఖాన్ను అడిగితే.. మరో ఆలోచన లేకుండా ‘ఊ అంటావా’ అని హమ్ చేశాడు సల్మాన్.
ఇలా ఓ తెలుగు పాట లిరిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ నోటి నుంచి వినిపించడం.. ఈ పాట ఆయన ఫేవరెట్గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని బట్టే ఈ పాట ఏ స్థాయిలో హిట్టయిందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ నోట తన పాట వినిపించేసరికి సమంత కూడా ఎగ్జైట్ అయింది. ట్విటర్లో ఈ పోస్టుకు బదులుగా లవ్ ఇమోజీలు పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘పుష్ప-2’లో కూడా ఇలాంటి పాట ఒకటి పడితే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయం.
This post was last modified on June 27, 2022 6:24 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…