హీరోయిన్లు మంచి వయసులో ఉండగా.. ఫిలిం కెరీర్ మంచి ఊపు మీద ఉండగా.. పెళ్లి గురించే ఆలోచించరు అసలు. చాలామంది హీరోయిన్లు 30 ప్లస్ వయసులో, కెరీర్ చరమాంకానికి వచ్చాక, గ్లామర్ రోల్స్ తగ్గిపోయాక పెళ్లి వైపు అడుగులు వేస్తుంటారు. కొందరు హీరోయిన్లయితే కెరీర్ కోసం పెళ్లికి పూర్తిగా దూరమవుతుంటారు కూడా. హీరోయిన్ల కెరీర్ స్పానే తక్కువ కాబట్టి వాళ్ల ఈ ఆలోచనను తప్పుబట్టలేం. పెళ్లి విషయంలోనే ఇలా ఉండేవాళ్లు ఇక పిల్లల గురించి ఆలోచించడం అంటే చాలా కష్టం. పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల విషయంలో చాలా ఏళ్లు ఆగుతుంటారు.
కొందరేమో ప్రెగ్నెన్సీ కారణంగా తమ గ్లామర్ ఎక్కడ దెబ్బ తింటుందో అని, ఆ నొప్పులు భరించలేమో అని సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎవరి ఛాయిస్ వాళ్లది కాబట్టి ఈ విషయంలోనూ తప్పులు ఎంచలేం. కానీ ఇలాంటి వాళ్లందరికీ తాను భిన్నమని చాటింది ఆలియా భట్.
రణబీర్ కపూర్ అంటే ఆమెకు ఎంతిష్టమో అందరికీ తెలుసు. అతడి ప్రేమలో పడ్డాక ఆమెలో చాలా మార్పు చూశారు చాలామంది. బహిరంగ వేదికల్లో కూడా తన మీద ప్రేమను దాచుకునేది కాదు. రణబీర్ మీద ఆరాధన భావం తన కళ్లలో, తన చర్యల్లో స్పష్టంగా కనిపించేది. ఒక మామూలు అమ్మాయిలా అతడిని ఆరాధించిన ఆలియా.. తనను పెళ్లి చేసుకోవాలన్న కలను ఈ మధ్యే నెరవేర్చుకుంది. మామూలుగా హీరో హీరోయిన్లెవరికైనా పెళ్లి అయిందంటే కొన్ని నెలల తర్వాత నుంచి ప్రెగ్నెన్సీపై మీడియా నుంచి ప్రశ్నలు మొదలైపోతుంటాయి. కానీ ఆలియా, రణబీర్ వాళ్లకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. పెళ్లయి రెండు నెలలు తిరగ్గానే శుభవార్త చెప్పేశారు. బహుశా ఒక హీరోయిన్ పెళ్లయ్యాక ఇంత వేగంగా గర్భం ధరించడం ఒక రికార్డు కావచ్చేమో.
ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ, మంచి వయసులో ఉండి, కెరీర్ మంచి ఊపులో ఉండగా.. ఆలియా బిడ్డను కనేందుకు సిద్ధపడడం చాలామంది మింగుడుపడడం లేదు. కానీ కెరీర్ కంటే కూడా బిడ్డకు జన్మనివ్వడం ముఖ్యమని, మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఆలియా డిసైడైనట్లు ఉంది. కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తాను చాలా స్పెషల్ అని చాటిచెప్పింది ఆలియా.
This post was last modified on June 27, 2022 6:17 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…