టాలీవుడ్లో బాగా కమర్షియల్ అని పేరున్న హీరోల్లో ప్రముఖంగా మహేష్ బాబు పేరే వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నమ్రత శిరోద్కర్ను పెళ్లాడాక అతను కమర్షియల్ అయ్యాడని అంటారు. ఆమె రాకతోనే మహేష్కు తన బ్రాండ్ వాల్యూ ఏంటో తెలిసి పారితోషకాలు పెంచడం.. సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా మారడం.. అలాగే పెద్ద ఎత్తున కమర్షియల్స్ చేయడం.. మల్టీప్లెక్స్ బిజినెస్లోకి కూడా దిగడం చేశాడు.
మహేష్ ఏం చేసినా అందులో వాణిజ్య ప్రయోజనం ఉంటుందని కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా అతను పంచుకున్న ఓ సరదా ఫొటో కూడా అందులో భాగమే కావడం చర్చనీయాంశంగా మారింది.
తన భార్య నమ్రతతో కలిసి వాషింగ్ మెషీన్ ముందు మహేష్ షార్ట్స్లో నిలబడ్డ ఆఫ్ బీట్ ఫొటో అది. మెషీన్ బ్రాండ్ సరిగా కనిపించలేదు కానీ.. దాని మీద మాత్రం ఏరియల్ బ్రాండ్ పౌడర్ ఉంది. ముందు ఇది మామూలు ఆఫ్ బీట్ ఫొటో అనే అంతా అనుకున్నారు. ఎందుకంటే అది అంత సహజంగా కనిపిస్తోంది. నమ్రత వాషింగ్ మెషీన్లోకి బట్టలు వేసే క్రమంలో మహేష్ దాన్ని గమనిస్తున్నట్లు అనిపించింది.
కానీ అది ఏరియల్ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా దిగిన పొటో అనే విషయం తర్వాత వెల్లడైంది. మహేష్-నమ్రత మాత్రమే కాదు.. నాగచైతన్య-సమంత సైతం ఇదే ఏరియల్ బ్రాండ్ కోసం ప్రచారంలో భాగంగా ఇలాంటి ఫొటోనే దిగడంతో విషయం అందరికీ బోధపడింది. ప్రమోషన్ పేరు చెప్పకుండా సెలబ్రెటీలు ఇలా క్యాజువల్ ఫొటోలన్నట్లుగా రిలీజ్ చేసి తమ ఫాలోవర్లకు మస్కా కొట్టడం కరెక్టేనా అన్న చర్చ నడుస్తోందిప్పుడు.
This post was last modified on June 29, 2020 10:24 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…