ఒకప్పటి ఎం.ఎస్.రాజు వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శత్రువు, దేవి, ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఘనవిజయాలతో ట్రెండ్ సెట్ చేసిన నిర్మాత ఆయన. ఇప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు.. తనకు ఎం.ఎస్.రాజునే స్ఫూర్తి అని చెబుతుంటాడు.
ఐతే ఒక దశ దాకాక వరుస పరాజయాలతో ఆయన దెబ్బ తిన్నారు. మధ్యలో బాగా గ్యాప్ తీసుకుని.. ‘డర్టీ హరి’ అనే చిన్న స్థాయి, బోల్డ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘డర్టీ హరి’ పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీలో రిలీజై సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోవలోనే కొడుకు సుమంత్ అశ్విన్ను హీరోగా పెట్టి ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమా చేశాడు. శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది.
ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ పెట్టిన రాజు.. ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి గురించి, టికెట్ల ధరల ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిన టికెట్ల రేట్లు చిన్న సినిమాలకు శాపంగా మారాయని ఎం.ఎస్.రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలకు ఎంత రేటు పెట్టినా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారని.. కానీ చిన్న సినిమాలకు కూడా ఎక్కువ రేట్లు ఉంటే చాలా కష్టమని రాజు అన్నారు.
సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 200 టికెట్ల రేటు పెడితే ఒక చిన్న సినిమాను వచ్చి ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. సినిమా చాలా బాగుందంటే తప్ప ఈ రేట్లతో థియేటర్లకు రారని.. యావరేజ్ అని తెలియగానే ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అని ఆగిపోతారని.. ఇప్పుడు ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు ఉన్నాయని ఆయనన్నారు. తన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’కు ఒక థియేటర్లో రూ.200 రేటు ఉంటే అంత ఎందుకు పెట్టారని అడిగి తగ్గించే ప్రయత్నం చేసినట్లు రాజు వెల్లడించారు. ఈ రేట్లు కచ్చితంగా చిన్న సినిమాలను చంపేస్తాయని.. ఇండస్ట్రీలో పెద్దలందరూ చిన్న సినిమాలను కాపాడేందుకు రీజనబుల్ టికెట్ రేట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని రాజు కోరారు. సరిగ్గా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే రాజు మాట్లాడారని చెప్పాలి. మరి ఆయన మాటల్ని ఇండస్ట్రీ పెద్దలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి.
This post was last modified on June 25, 2022 8:08 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…