Movie News

ఎం.ఎస్.రాజు మాటలు పట్టించుకుంటారా?

ఒకప్పటి ఎం.ఎస్.రాజు వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శత్రువు, దేవి, ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఘనవిజయాలతో ట్రెండ్ సెట్ చేసిన నిర్మాత ఆయన. ఇప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజు.. తనకు ఎం.ఎస్.రాజునే స్ఫూర్తి అని చెబుతుంటాడు.

ఐతే ఒక దశ దాకాక వరుస పరాజయాలతో ఆయన దెబ్బ తిన్నారు. మధ్యలో బాగా గ్యాప్ తీసుకుని.. ‘డర్టీ హరి’ అనే చిన్న స్థాయి, బోల్డ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘డర్టీ హరి’ పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీలో రిలీజై సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ కోవలోనే కొడుకు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పెట్టి ‘7 డేస్ 6 నైట్స్’ అనే సినిమా చేశాడు. శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది.

ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ పెట్టిన రాజు.. ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి గురించి, టికెట్ల ధరల ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిన టికెట్ల రేట్లు చిన్న సినిమాలకు శాపంగా మారాయని ఎం.ఎస్.రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలకు ఎంత రేటు పెట్టినా జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారని.. కానీ చిన్న సినిమాలకు కూడా ఎక్కువ రేట్లు ఉంటే చాలా కష్టమని రాజు అన్నారు.


సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 200 టికెట్ల రేటు పెడితే ఒక చిన్న సినిమాను వచ్చి ఎవరు చూస్తారని ఆయన ప్రశ్నించారు. సినిమా చాలా బాగుందంటే తప్ప ఈ రేట్లతో థియేటర్లకు రారని.. యావరేజ్ అని తెలియగానే ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అని ఆగిపోతారని.. ఇప్పుడు ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు ఉన్నాయని ఆయనన్నారు. తన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’కు ఒక థియేటర్లో రూ.200 రేటు ఉంటే అంత ఎందుకు పెట్టారని అడిగి తగ్గించే ప్రయత్నం చేసినట్లు రాజు వెల్లడించారు. ఈ రేట్లు కచ్చితంగా చిన్న సినిమాలను చంపేస్తాయని.. ఇండస్ట్రీలో పెద్దలందరూ చిన్న సినిమాలను కాపాడేందుకు రీజనబుల్ టికెట్ రేట్లు ఉండేలా చర్యలు చేపట్టాలని రాజు కోరారు. సరిగ్గా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే రాజు మాట్లాడారని చెప్పాలి. మరి ఆయన మాటల్ని ఇండస్ట్రీ పెద్దలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి.

This post was last modified on June 25, 2022 8:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

37 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago