ఇవాళ విడుదలైన ఎనిమిది సినిమాల్లో దేనికీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. అంతో ఇంతో అంచనాలున్న సమ్మతమే సోసో రిపోర్ట్స్ తెచ్చుకోగా చోర్ బజార్ అంతకన్నా తక్కువ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఇక మిగిలినవాటి గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. ఈ నేపథ్యంలో వచ్చే వారం 1న రాబోతున్న పక్కా కమర్షియల్ కు మంచి గ్రౌండ్ దొరికింది. పోటీగా ఏం లేకపోవడం బాగా కలిసొచ్చే అంశం. ఇదే డేట్ కి రావాలనుకున్న రంగ రంగ వైభవంగా డ్రాప్ కావడం, రేస్ లో ఉన్న రాకెట్రీ మీద బజ్ లేకపోవడం ఇవన్నీ ప్లస్సే.
బాక్సాఫీస్ ఆల్రెడీ డల్ గా ఉంది. విక్రమ్ తన కెపాసిటీకి మించి డబుల్ రాబట్టింది. మేజర్ పని సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. అంటే సుందరానికి భారంగా నెట్టుకొస్తున్నాడు. ఎఫ్3 పూర్తి బ్రేక్ ఈవెన్ చేరకపోయినా వీకెండ్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతోంది. ఆప్షన్లు లేకపోవడం వల్లే చాలా సెంటర్స్ లో 777 ఛార్లీని తీసేయలేదు. ఇదే నయమనే ఫీలింగ్ లో జనాలు వెళ్తున్నారు. సో జూలై 1 నాటికి మాస్ ఆడియన్స్ కి పక్కా కమర్షియల్ ఒకటే ఆప్షన్ గా నిలుస్తుంది. సో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బాగానే ఉందనే టాక్ వచ్చినా చాలు పక్కా కమర్షియల్ పాసైపోతుంది. ప్రతి రోజు పండగేతో పెద్ద హిట్టు కొట్టి మంచి రోజులు వచ్చాయితో షాక్ తిన్న దర్శకుడు మారుతీకి ఇది హిట్ కావడం చాలా అవసరం. నెక్స్ట్ హ్యాండిల్ చేయబోయేది ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని. సో దానికి తగిన అర్హుడినే అని ఋజువు చేసుకునేందుకు పక్కా కమర్షియల్ రిజల్ట్ ఉపయోగపడుతుంది. ట్రైలర్ చూస్తే రెగ్యులర్ స్టైల్ లో ఉన్నప్పటికీ పైసా వసూల్ బాపతులాగే కనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్ వాడుకుంటే గోపీచంద్ కో హిట్టు దక్కినట్టే.
This post was last modified on June 24, 2022 7:48 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…