అవును థాంక్ యు విడుదల తేదీ మారింది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు ముందు ప్రకటించిన డేట్ జూలై 8. కానీ ఆ తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనని అర్థమయ్యింది. దీంతో జూలై 22కి వాయిదా వేసి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంకో రెండు వారాల్లో చైతుని బిగ్ స్క్రీన్ మీద చూడొచ్చని ఆశించిన అభిమానులకు ఇది నిరాశ కలిగించేదే అయినా తక్కువ గ్యాప్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు.
కారణాలు బయటికి చెప్పలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కు తగినంత సమయం లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఒకవేళ పాత తేదీనే ఫిక్స్ అయితే చేతిలో ఉన్నది రెండు వారాలు మాత్రమే. ఆలోగా అన్నీ పూర్తి చేయాలి.
మిగిలిన లిరికల్ వీడియోలు, ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్రా చాలా వర్క్ ఉంటుంది. ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం సులభం కాదు. దూత వెబ్ సిరీస్ షూట్ లో ఉన్న చైతు దీని కోసమే ఆల్రెడీ తన కాల్ షీట్స్ ని ఖాళీగా ఉంచుకున్నా లాభం లేకపోయింది
నిజానికి థాంక్ యుకు ఈ టైంకల్లా రావాల్సిన బజ్ ఇంకా చేరలేదు. ఫ్యాన్స్ సంగతేమో కానీ సామాన్య ప్రేక్షకుల్లో ఇదింకా బలంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు ప్రీ రిలీజ్ టైంలో ఈ సీన్ లేదు. పాటలు హిట్టవ్వడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి వీటి మీద ఆసక్తి ఉండేది.
కానీ మనం కాంబినేషన్ రిపీట్ అవుతున్నా సరే థాంక్ యుకి ఆ హడావిడి కనిపించడం లేదు. పైగా దిల్ రాజు నిర్మాణం, తమన్ సంగీతం, రాశిఖన్నా హీరోయిన్ లాంటి హంగులు ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచాలి మరి. దానికి కనీసం నెల రోజులు కావాలి. అందుకే మంచి డెసిషన్ తీసుకున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…