తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. ఈ వెబ్ సైట్ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్ను విజయవంతంగా నడిపిస్తున్నాడు అడ్మిన్. ఆ వ్యక్తితో తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది. పైరసీ వ్యవహారాల మీద తమిళ్ రాకర్స్ అడ్మిన్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ ఇంటర్వ్యూలో.
ఇలా కొత్త సినిమాలను పైరసీ చేసి ఇంటర్నెట్లో అందరికీ షేర్ చేయడం నైతికంగా ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి దిమ్మదిరిగిపోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ దొంగలే అని.. ఒకరినొకరు మోసం చేసేవారేనని.. కొత్త సినిమాల పైరసీ విషయంలో తనకు ఇండస్ట్రీ జనాలే సహకారం అందిస్తుంటారని అతను చెప్పడం గమనార్హం. కమల్ హాసన్ సినిమా ఉత్తమ విలన్ విడుదలైన మూడు గంటలకే తన చేతికి హెచ్డీ ప్రింట్ వచ్చిందని.. ఇండస్ట్రీలోని వ్యక్తులే తనకు డబ్బులిచ్చి ఆ సినిమా పైరసీ ప్రింట్ను రిలీజ్ చేయాలని చెప్పారని.. ఇలా చాలా సినిమాలకు జరిగిందని అతను వెల్లడించడం షాకింగే.
అంతే కాక ఈ మధ్య ఒకే తేదీకి రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఒక సినిమా నిర్మాత.. ఇంకో సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేయాలని తమను సంప్రదించాడని.. ఇలా ఇండస్ట్రీలోనే పెద్ద దొంగలు ఉన్నారని.. అలాంటపుడు పైరసీ చేస్తున్న తమ గురించి బయటపెట్టడం, శిక్షించడం ఎలా సాధ్యం అవుతుందని తమిళ్ రాకర్స్ అడ్మిన్ ప్రశ్నించడం గమనార్హం. బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎదురైనపుడు అన్ని సినిమాలూ బాగా ఆడాలి, అందరూ బాగుండాలి అని కామెంట్లు చేసే నిర్మాతలు.. తెర వెనుక ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే షాకవ్వాల్సిందే.
This post was last modified on June 23, 2022 2:37 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…