తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. ఈ వెబ్ సైట్ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్ను విజయవంతంగా నడిపిస్తున్నాడు అడ్మిన్. ఆ వ్యక్తితో తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది. పైరసీ వ్యవహారాల మీద తమిళ్ రాకర్స్ అడ్మిన్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ ఇంటర్వ్యూలో.
ఇలా కొత్త సినిమాలను పైరసీ చేసి ఇంటర్నెట్లో అందరికీ షేర్ చేయడం నైతికంగా ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి దిమ్మదిరిగిపోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ దొంగలే అని.. ఒకరినొకరు మోసం చేసేవారేనని.. కొత్త సినిమాల పైరసీ విషయంలో తనకు ఇండస్ట్రీ జనాలే సహకారం అందిస్తుంటారని అతను చెప్పడం గమనార్హం. కమల్ హాసన్ సినిమా ఉత్తమ విలన్ విడుదలైన మూడు గంటలకే తన చేతికి హెచ్డీ ప్రింట్ వచ్చిందని.. ఇండస్ట్రీలోని వ్యక్తులే తనకు డబ్బులిచ్చి ఆ సినిమా పైరసీ ప్రింట్ను రిలీజ్ చేయాలని చెప్పారని.. ఇలా చాలా సినిమాలకు జరిగిందని అతను వెల్లడించడం షాకింగే.
అంతే కాక ఈ మధ్య ఒకే తేదీకి రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఒక సినిమా నిర్మాత.. ఇంకో సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేయాలని తమను సంప్రదించాడని.. ఇలా ఇండస్ట్రీలోనే పెద్ద దొంగలు ఉన్నారని.. అలాంటపుడు పైరసీ చేస్తున్న తమ గురించి బయటపెట్టడం, శిక్షించడం ఎలా సాధ్యం అవుతుందని తమిళ్ రాకర్స్ అడ్మిన్ ప్రశ్నించడం గమనార్హం. బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎదురైనపుడు అన్ని సినిమాలూ బాగా ఆడాలి, అందరూ బాగుండాలి అని కామెంట్లు చేసే నిర్మాతలు.. తెర వెనుక ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే షాకవ్వాల్సిందే.
This post was last modified on June 23, 2022 2:37 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…