తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. ఈ వెబ్ సైట్ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఆ వెబ్ సైట్ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్ను విజయవంతంగా నడిపిస్తున్నాడు అడ్మిన్. ఆ వ్యక్తితో తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది. పైరసీ వ్యవహారాల మీద తమిళ్ రాకర్స్ అడ్మిన్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ ఇంటర్వ్యూలో.
ఇలా కొత్త సినిమాలను పైరసీ చేసి ఇంటర్నెట్లో అందరికీ షేర్ చేయడం నైతికంగా ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి దిమ్మదిరిగిపోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ దొంగలే అని.. ఒకరినొకరు మోసం చేసేవారేనని.. కొత్త సినిమాల పైరసీ విషయంలో తనకు ఇండస్ట్రీ జనాలే సహకారం అందిస్తుంటారని అతను చెప్పడం గమనార్హం. కమల్ హాసన్ సినిమా ఉత్తమ విలన్ విడుదలైన మూడు గంటలకే తన చేతికి హెచ్డీ ప్రింట్ వచ్చిందని.. ఇండస్ట్రీలోని వ్యక్తులే తనకు డబ్బులిచ్చి ఆ సినిమా పైరసీ ప్రింట్ను రిలీజ్ చేయాలని చెప్పారని.. ఇలా చాలా సినిమాలకు జరిగిందని అతను వెల్లడించడం షాకింగే.
అంతే కాక ఈ మధ్య ఒకే తేదీకి రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఒక సినిమా నిర్మాత.. ఇంకో సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేయాలని తమను సంప్రదించాడని.. ఇలా ఇండస్ట్రీలోనే పెద్ద దొంగలు ఉన్నారని.. అలాంటపుడు పైరసీ చేస్తున్న తమ గురించి బయటపెట్టడం, శిక్షించడం ఎలా సాధ్యం అవుతుందని తమిళ్ రాకర్స్ అడ్మిన్ ప్రశ్నించడం గమనార్హం. బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎదురైనపుడు అన్ని సినిమాలూ బాగా ఆడాలి, అందరూ బాగుండాలి అని కామెంట్లు చేసే నిర్మాతలు.. తెర వెనుక ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే షాకవ్వాల్సిందే.
This post was last modified on June 23, 2022 2:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…