Movie News

చైతు కోసం అరుదైన కలయిక

నాగ చైతన్య దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కోసం అరుదైన కలయికను సాధ్యం చేస్తున్నారు. ఇళయరాజా ఆయన వారసుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా చైతుకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది వెంకట్ ప్రభు ఇచ్చిన సూపర్ హిట్ మూవీ మానాడు రీమేక్ అనే ప్రచారం గతంలో జరిగింది కానీ నిజానికి ఇప్పుడు తీసుకున్నది ఫ్రెష్ సబ్జెక్ట్. కాకపోతే ఏ జానర్ అనేది బయటికి రాలేదు.

ఇళయరాజాకు నాగార్జునకు మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆఖరి పోరాటంలో ఎప్పటికీ మర్చిపోలేని పాటలు ఇచ్చారు. చైతన్య ఎంత డిజాస్టర్ అయినా అందులో ఓహో లైలా ఓ చారుశీలా ఇప్పటికీ పాడుకునే ఎవర్ గ్రీన్ యూత్ క్లాసిక్. నిర్ణయం గురించి చెబితే పుస్తకమే అవుతుంది. కిల్లర్ లో ప్రియా ప్రియతమా పాటను ఇష్టపడని మ్యూజిక్ లవర్స్ ఉండరు. అంతగా నాగ్ తో రాజా గారి బాండింగ్ ఉంది. చాలా కాలం నుంచి తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ తగ్గించేసిన ఇళయరాజా మొదటిసారి చైతుకి ట్యూన్స్ కట్టబోతున్నారు.

ఇక యువన్ కు టాలీవుడ్ కొత్తేమి కాదు.హ్యాపీ, ఆడవాళ్ళ మాటకు అర్థాలే వేరులే, ఓయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే లాంటి మంచి ఆల్బమ్స్ పడ్డాయి. కాకపోతే తండ్రి కొడుకులు కలిసి తెలుగు స్ట్రెయిట్ మూవీకి పని చేయడం మాత్రం ఇదే మొదటిసారి. టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రొడక్షన్ నెంబర్ కు పెట్టిన లోగో గట్రా చూస్తుంటే ఏదో కేసుకి సంబంధించిన క్రైమ్ డ్రామాలా తోస్తోంది. టిపికల్ స్క్రీన్ ప్లేతో అలరించే వెంకట్ ప్రభు చైతుని ఎలాంటి సబ్జెక్టులో ప్రెజెంట్ చేయనున్నాడో చూడాలి.

This post was last modified on June 23, 2022 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

56 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago