నాగ చైతన్య దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కోసం అరుదైన కలయికను సాధ్యం చేస్తున్నారు. ఇళయరాజా ఆయన వారసుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా చైతుకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది వెంకట్ ప్రభు ఇచ్చిన సూపర్ హిట్ మూవీ మానాడు రీమేక్ అనే ప్రచారం గతంలో జరిగింది కానీ నిజానికి ఇప్పుడు తీసుకున్నది ఫ్రెష్ సబ్జెక్ట్. కాకపోతే ఏ జానర్ అనేది బయటికి రాలేదు.
ఇళయరాజాకు నాగార్జునకు మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆఖరి పోరాటంలో ఎప్పటికీ మర్చిపోలేని పాటలు ఇచ్చారు. చైతన్య ఎంత డిజాస్టర్ అయినా అందులో ఓహో లైలా ఓ చారుశీలా ఇప్పటికీ పాడుకునే ఎవర్ గ్రీన్ యూత్ క్లాసిక్. నిర్ణయం గురించి చెబితే పుస్తకమే అవుతుంది. కిల్లర్ లో ప్రియా ప్రియతమా పాటను ఇష్టపడని మ్యూజిక్ లవర్స్ ఉండరు. అంతగా నాగ్ తో రాజా గారి బాండింగ్ ఉంది. చాలా కాలం నుంచి తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ తగ్గించేసిన ఇళయరాజా మొదటిసారి చైతుకి ట్యూన్స్ కట్టబోతున్నారు.
ఇక యువన్ కు టాలీవుడ్ కొత్తేమి కాదు.హ్యాపీ, ఆడవాళ్ళ మాటకు అర్థాలే వేరులే, ఓయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే లాంటి మంచి ఆల్బమ్స్ పడ్డాయి. కాకపోతే తండ్రి కొడుకులు కలిసి తెలుగు స్ట్రెయిట్ మూవీకి పని చేయడం మాత్రం ఇదే మొదటిసారి. టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రొడక్షన్ నెంబర్ కు పెట్టిన లోగో గట్రా చూస్తుంటే ఏదో కేసుకి సంబంధించిన క్రైమ్ డ్రామాలా తోస్తోంది. టిపికల్ స్క్రీన్ ప్లేతో అలరించే వెంకట్ ప్రభు చైతుని ఎలాంటి సబ్జెక్టులో ప్రెజెంట్ చేయనున్నాడో చూడాలి.
This post was last modified on June 23, 2022 1:44 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…