ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘రాజావారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి, మంచి పేరు సంపాదించాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. అతడి రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డివైడ్ టాక్తోనూ మంచి వసూళ్లు రాబట్టి అతడికి తొలి కమర్షియల్ సక్సెస్ను అందించింది. తర్వాతి చిత్రం ‘సెబాస్టియన్’ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు అతడి నుంచి వస్తున్న ‘సమ్మతమే’ ప్రామిసింగ్గా అనిపిస్తోంది.
శుక్రవారమే ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. బుధవారం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో కిరణ్ చక్కటి స్పీచ్తో ఆకట్టుకున్నాడు. అన్నింటికీ తన సినిమాల గురించి నిజాయితీగా అతను మాట్లాడిన మాటలు.. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయి థియేటర్ల పరిస్థితి దారుణంగా తయారవడంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు హార్ట్ టచింగ్గా అనిపించాయి జనాలకు.
తన తొలి సినిమా ‘రాజా వారు రాణి వారు’ చూసిన వాళ్లంతా చాలా బాగుందని అన్నారని.. కానీ ఆ సినిమా థియేటర్లలో అనుకున్నంతగా ఆడలేదని.. ఆ సమయంలో ఎలాంటి సినిమా చేస్తే జనాలకు నచ్చుతుందని అని ఆలోచించి.. సొంతంగా కథ రాసి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చేశానని.. ఆ చిత్రం తమ అంచనాలను మించి ఆడి తనలో ధైర్యం తెచ్చిందని కిరణ్ తెలిపాడు. ఐతే ఇప్పుడు తన కొత్త చిత్రం ‘సమ్మతమే’ రిలీజవుతుంటే చాలా టెన్షన్గా ఉందని.. జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం రోజు రోజుకీ తగ్గిపోతుండడమే అందుకు కారణమని కిరణ్ అన్నాడు.
ఓటీటీలకు అలవాటు పడి ఇంట్లోనే కూర్చుని టీవీల్లో, మొబైళ్లలో సినిమాలు చూస్తున్నారని.. ఇది మంచి విషయమే అయినా.. థియేటర్లకు వెళ్లి 400 మందితో కలిసి రకరకాల ఎమోషన్లు ఫీలవుతూ సినిమా చూడడం అసలైన సెలబ్రేషన్ అని.. ఆ ప్రాసెస్ను అందరూ ఎంజాయ్ చేయాలని, థియేటర్ల సిస్టమ్ను కాపాడుకోవాలని.. అందుకే తన సినిమాతో పాటు అన్ని చిత్రాలనూ థియేటర్లకే వచ్చి చూడాలని అతను కోరాడు. ‘సమ్మతమే’ సినిమా మీద ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా థియేటర్లకు వచ్చి చూడాలని.. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలని, లేదంటే బాలేదనే నిజాయితీగా చెప్పాలని.. అప్పుడే తాను జాగ్రత్తగా సినిమాలు చేస్తానని కిరణ్ పేర్కొనడం విశేషం.
This post was last modified on June 23, 2022 1:29 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…