‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. ఒక కొత్త హీరోకు ఇంతకంటే మించిన అరంగేట్రం దక్కదు. రెండో సినిమాకే క్రిష్ లాంటి టాప్ డైరెక్టర్తో సినిమా చేశాడతను. కానీ వీరి కలయికలో వచ్చిన ‘కొండపొలం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
త్వరలోనే అతను ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ లోపు వైష్ణవ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ‘భీమ్లా నాయక్’ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. త్రివిక్రమ్ సంస్థ ‘ఫార్చ్యూన్ 4’ కూడా ఇందులో భాగస్వామిగా ఉండడం విశేషం.
శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు ఈ రోజు. వైష్ణవ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఊర మాస్గా ఉండబోతోందని, వయొలెన్స్-యాక్షన్ ఒక రేంజిలో ఉంటుందని ఇందులో వినిపించిన డైలాగులను బట్టి అర్థమవుతోంది. రూరల్ బ్యాక్డ్రాప్లో నాటుగా ఉండే సినిమా అనే సంకేతాలను ఈ గ్లింప్స్ ఇచ్చింది. ‘‘తలలు కోసి సేతికిస్తా నా యాలా.. సూస్కుందాం రా’’ అంటూ వైష్ణవ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. కేవలం డైలాగులతోనే సినిమా మీద అంచనాలను పెంచడంలో చిత్ర బృందం విజయవంతం అయింది.
ఇక ఈ అనౌన్స్మెంట్ వీడియోలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రిలీజ్ డేటే. సినిమా ఆరంభ దశలోనే విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం. 2023 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజవుతుందని ప్రకటించారు. మామూలుగా సంక్రాంతి పండుగ అంటే భారీ చిత్రాలే రేసులో నిలుస్తుంటాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’తో పాటు రామ్ చరణ్-శంకర్ల చిత్రం కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇంత భారీ సినిమాలు ఉండగా వాటికి పోటీగా వైష్ణవ్ చిత్రాన్ని పోటీలో నిలపాలనుకోవడం సాహసమే. అందులోనూ ఇది పండక్కి సరిపోయే ఫ్యామిలీ మూవీ కూడా కాదు. ఓ కొత్త దర్శకుడు రూపొందించిన మాస్ మూవీని భారీ చిత్రాల మీదికి పోటీకి దింపడంలో చిత్ర బృందం కాన్ఫిడెన్స్ ఏంటో?
This post was last modified on June 22, 2022 1:48 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…