కెరీర్ ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ బయటెక్కడా కనిపించేవాడు కాదు. మీడియాతో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా హడావుడి కూడా ఉండేది కాదు. వర్మ సైలెంటుగా తన పని తాను చేసుకుపోయేవాడు. కేవలం ఆయన సినిమానే మాట్లాడేది. శివతో మొదలుపెట్టి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వర్మ. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వందలు, వేల మంది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన శిష్యులు కూడా సెన్సేషనల్ సినిమాలు తీశారు. పెద్ద డైరెక్టర్లయ్యారు.
కెరీర్లో తొలి 10-15 ఏళ్లు వర్మ మామూలు సినిమాలు తీయలేదు. అలాగే ఇండస్ట్రీ మీద మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. కానీ కెరీర్లో ఒక దశ వరకు కంటెంట్ను నమ్ముకున్న వర్మ.. ఆ తర్వాత దాని మీద ఫోకస్ తగ్గించి పబ్లిసిటీ మీదికి దృష్టి మళ్లించాడు. అక్కడే ఆయన ట్రాక్ తప్పేశాడు. కేవలం సెన్సేషనలిజాన్ని నమ్ముకుంటే అది ఎక్కువ కాలం నడవదు.
కొంత విషయం ఉండి, కొంత పబ్లిసిటీ తోడైతే ఓకే కానీ.. విషయం పూర్తిగా మరుగున పడిపోయి కేవలం పబ్లిసిటీనే నమ్ముకుంటే ఎలా? వర్మ ఇదే పని చేశాడు. పూర్తిగా ప్రేక్షకుల్లో క్రెడిబిలిటీ కోల్పోయాడు. వివాదాస్పద అంశాల మీద నాసిరకం సినిమాలు తీసి కొంత వరకు డబ్బులు చేసుకున్న వర్మకు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఆయన ఏ అంశం మీద సినిమా తీసినా, ఎంత పబ్లిసిటీ చేసినా, వివాదాలు క్రియేట్ చేయాలని చూసినా జనాలు పట్టించుకోవట్లేదు.
వర్మ తీసిన సినిమాలు చాలానే బిజినెస్ జరక్క మూలన పడి ఉన్నాయి. చాలా కష్టపడి ‘డేంజరస్’ అనే సినిమాను రిలీజ్ చేస్తే.. ఏదో నామమాత్రంగా ఒకటీ అరా థియేటర్లలో ఆడి వెళ్లిపోయింది. హీరోయిన్లతో విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయించినా ఆ చిత్రాన్ని కుర్రాళ్లు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడేమో వర్మ నుంచి ‘కొండా’ అనే సినిమా రాబోతోంది. వరంగల్ జిల్లాకు చెందిన నక్సలైట్ టర్న్డ్ పొలిటీషియన్ కొండా మురళి జీవిత కథ ఆధారంగా వర్మ ఈ చిత్రం తీశాడు. కానీ ఎంత చేసినా ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేయలేకపోయాడు.
వర్మ సినిమా అంటేనే జనాల్లో పూర్తిగా ఆసక్తి పోవడం ఇందుకు కారణం. దీంతో పాటు వస్తున్న సమ్మతమే, చోర్ బజార్ ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కానీ.. దీనికి మాత్రం మినిమం బజ్ కనిపించట్లేదు. ఈ సినిమా ఆడితే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ‘కొండా’కు కూడా వర్మ గత సినిమాల గతే పడితే.. తన చిత్రాల పట్ల జనాలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో వర్మకు బాగా అర్థం అవుతుంది.
This post was last modified on June 22, 2022 11:32 am
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…