Movie News

సాహో – మెగా హీరో.. నిజమేనా మైత్రీ?

వ్రతం చెడింది ఫలితం దక్కలేదు అన్నట్టు తయారయ్యింది దర్శకుడు సుజిత్ పరిస్థితి సాహో ఫలితం వచ్చాక. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ యాక్షన్ గ్రాండియర్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ కుర్రాడు ఏ ప్రశాంత్ నీల్ రేంజ్ లో స్టార్ హీరోలు తన వెంట పడేలా చేసుకునేవాడు.

దానికి తోడు చేతికి వచ్చి జారిపోయిన చిరంజీవి లూసిఫర్ రీమేక్ అవకాశం కూడా తన కెరీర్ ని కొంత ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా తన కొత్త సినిమా ఎవరితో ఉంటుందన్న అప్డేట్ లేకపోయింది. అతనైనా మీడియాకు కనిపిస్తేగా.

లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుజిత్ ఓ మెగా హీరోతో లాక్ అయ్యాడు. వరుణ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్టు సెట్ చేస్తోందట. బ్యాక్ డ్రాప్ ఏంటనే లీక్ బయటికి రాలేదు కానీ రన్ రాజా రన్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని తెలిసింది.

ఇంతకు మించి వివరాలేం రాలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హిట్ క్రెడిట్ ని వెంకటేష్ తో పంచుకోవాల్సి వచ్చినా గని డిజాస్టర్ తాలూకు గాయం నుంచి త్వరగా బయటపడేందుకు ఎఫ్3 ఉపయోగపడిందన్నది వాస్తవం.

దీని తాలూకు అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కేవలం భారీ చిత్రాలే కాకుండా అంటే సుందరానికి టైపులో మీడియం బడ్జెట్ సినిమాల మీద కూడా మైత్రి పెట్టుబడులు పెడుతోంది.

లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే విషయంలో అందుకే స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకుని మరీ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేస్తోంది. ఎలాగూ పెద్ద హీరోలతో చేస్తున్నవి అప్పుడప్పుడూ రిస్క్ లో పెడుతుంటాయి. అలాంటప్పుడు సేఫ్ గేమ్ కోసం ఇలాంటివి చేయడం తప్పేం కాదు. మరి సుజిత్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on June 21, 2022 8:04 pm

Share

Recent Posts

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…

1 hour ago

దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!

ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…

3 hours ago

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

6 hours ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

6 hours ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

6 hours ago