వ్రతం చెడింది ఫలితం దక్కలేదు అన్నట్టు తయారయ్యింది దర్శకుడు సుజిత్ పరిస్థితి సాహో ఫలితం వచ్చాక. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ యాక్షన్ గ్రాండియర్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ కుర్రాడు ఏ ప్రశాంత్ నీల్ రేంజ్ లో స్టార్ హీరోలు తన వెంట పడేలా చేసుకునేవాడు.
దానికి తోడు చేతికి వచ్చి జారిపోయిన చిరంజీవి లూసిఫర్ రీమేక్ అవకాశం కూడా తన కెరీర్ ని కొంత ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా తన కొత్త సినిమా ఎవరితో ఉంటుందన్న అప్డేట్ లేకపోయింది. అతనైనా మీడియాకు కనిపిస్తేగా.
లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుజిత్ ఓ మెగా హీరోతో లాక్ అయ్యాడు. వరుణ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్టు సెట్ చేస్తోందట. బ్యాక్ డ్రాప్ ఏంటనే లీక్ బయటికి రాలేదు కానీ రన్ రాజా రన్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని తెలిసింది.
ఇంతకు మించి వివరాలేం రాలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హిట్ క్రెడిట్ ని వెంకటేష్ తో పంచుకోవాల్సి వచ్చినా గని డిజాస్టర్ తాలూకు గాయం నుంచి త్వరగా బయటపడేందుకు ఎఫ్3 ఉపయోగపడిందన్నది వాస్తవం.
దీని తాలూకు అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కేవలం భారీ చిత్రాలే కాకుండా అంటే సుందరానికి టైపులో మీడియం బడ్జెట్ సినిమాల మీద కూడా మైత్రి పెట్టుబడులు పెడుతోంది.
లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే విషయంలో అందుకే స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకుని మరీ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేస్తోంది. ఎలాగూ పెద్ద హీరోలతో చేస్తున్నవి అప్పుడప్పుడూ రిస్క్ లో పెడుతుంటాయి. అలాంటప్పుడు సేఫ్ గేమ్ కోసం ఇలాంటివి చేయడం తప్పేం కాదు. మరి సుజిత్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on June 21, 2022 8:04 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…