నందమూరి బాలకృష్ణ కెరీర్ గత ఆరు నెలల్లో ఊహించని టర్న్ తీసుకుంది. యన్.టి.ఆర్-కథానాయకుడు, యన్.టి.ఆర్-మహానాయకుడు, రూలర్ చిత్రాలతో బాగా డీలా పడిపోయి, ఇక మళ్లీ పుంజుకోవడం కష్టం అనుకున్న టైంలో ‘అఖండ’తో ఆయన బాక్సాఫీస్ దగ్గర చేసిన బీభత్సానికి అందరూ షాకైపోయారు. దాని కంటే ముందు ‘అన్ స్టాపబుల్’ షోతో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.
మామూలుగా బయట మాట్లాడేటపుడు బాలయ్యకు ఎంతగా మాట తడబడుతుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒక టాక్ షో చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ‘అన్స్టాపబుల్’తో ఆయన పెద్ద షాకే ఇచ్చాడు. ఈ షోలో బాలయ్య చూపించిన ఎనర్జీ అన్ మ్యాచబుల్ అనే చెప్పాలి. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఒక కొత్త బాలయ్యను చూపించింది ఈ షో. టైటిల్కు తగ్గట్లే ‘అన్ స్టాపబుల్’ అనిపిస్తూ ఎపిసోడ్ ఎపిసోడ్కూ మరింతగా ఇంప్రెస్ చేస్తూ జనాలను ఆకట్టుకున్నాడు బాలయ్య.
ఈ షో వల్ల బాలయ్యకు.. అలాగే ‘ఆహా’కు గొప్ప ప్రయోజనమే చేకూరింది. తొలి సీజన్లో పది ఎపిసోడ్లకు పైగానే నడిచిన ఈ షోకు తెరపడుతున్నపుడు అందరూ చాలా ఫీలయ్యారు.. అప్పుడే అయిపోయిందా అని. ఐతే ఇంత సక్సెస్ అయిన షోకు ఎండ్ కార్డ్ పడిపోతుందని ఎవరూ అనుకోలేదు. అనుకున్నట్లే ఇప్పుడు ఈ షో తిరిగి రాబోతోంది.
‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోకు అతిథిా వచ్చిన బాలయ్యను సింగర్ శ్రీరామచంద్ర ‘అన్ స్టాపబుల్’ గురించి అడిగాడు. దానికాయన బదులిస్తూ.. ‘‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు, కొనసాగింపే’’ అని బదులిచ్చారు. ఈ కామెంట్తోనే ఆహా వారు ‘అన్స్టాబపుల్-2’ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అతి త్వరలోనే రెండో సీజన్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి సీజన్లో మహేష్ బాబు, రాజమౌళి, మోహన్ బాబు, రవితేజ, నాని, బ్రహ్మానందం.. ఇలా చాలామంది ప్రముఖులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరి రెండో సీజన్లో బాలయ్యతో కలిసి హంగామా చేసే తారలెవరో చూడాలి.
This post was last modified on June 21, 2022 12:07 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…