Movie News

జగన్ సార్.. ఎందుకీ కెలుకుడు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన వ్యవహారాలు, పరిష్కరిచాల్సిన సమస్యలు బోలెడున్నాయి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్తుంటే జనాలు ఎన్నో సమస్యలు ఏకరవు పెడుతున్నారు. అధికార పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐతే జనాలు మొరపెట్టుకుంటున్న సమస్యల్ని వదిలేసి.. అవసరం లేని వ్యవహారాల్లో తలదూర్చి కొత్త సమస్యలు సృష్టించడం జగన్ సర్కారకు అలవాటుగా మారుతోందన్న ముందు నుంచి ఉన్న విమర్శ.

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఈ కోవకే చెందుతుంది. సినిమా బిజినెస్ అనేది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. సినిమా తీసేది ఒకరు. దాన్ని పంపిణీ చేసేది ఇంకొకరు. ప్రదర్శించేది మరొకరు. చూసేదేమో జనం. ఇందులో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎక్కడైనా సమస్య తలెత్తి అది ప్రభుత్వం దృష్టికి వస్తే అప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్ సర్కారు మాత్రం గత ఏడాది పవన్‌ కళ్యాణ్‌ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసే క్రమంలో అనూహ్యంగా టికెట్ల రేట్లు తగ్గించేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సమస్య నెలల తరబడి ఎలా నానిందో.. పేదల కోసం రేట్లు తగ్గించాం అని ఊదరగొట్టి చివరికి ఇండస్ట్రీ జనాల్ని బాగా ఏడిపించి, వాళ్లు తమ ముందు సాగిలపడ్డాక గతంలో ఉన్నదాని కంటే ఎలా రేట్లు పెంచి పడేశారో తెలిసిందే.

ఇలా లేని సమస్యను సృష్టించి.. తర్వాత దాన్నేదో పరిష్కరించేసినట్లు కలరింగ్ ఇవ్వడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. ఐతే అయ్యిందేదో అయ్యిందిలే అనుకుంటే.. ఇప్పుడు టికెట్ల బుకింగ్ వ్యవహారం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తుండటం.. ఎగ్జిబిటర్ల మెడ మీద కత్తి పెట్టి దీనికి సంబంధించి ఎంవోయూ మీద సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నిస్తుండటం వివాదాస్పదమవుతోంది.

ఇక నుంచి బుక్ మై షో, పేటీఎం లాంటి టికెటింగ్ యాప్స్ ఏవీ ఏపీ వరకు పని చేయవు. పూర్తిగా ప్రభుత్వం తీసుకురానున్న ఆన్ లైన్ టికెటింగ్ యాప్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. ఐతే ఇది ఏ సమస్యలు లేకుండా, పారదర్శకంగా జరిపితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఇందులో 2 శాతం ప్రభుత్వం కమీషన్ తీసుకోవడమే కాక.. టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులను ఏ రోజుకు ఆ రోజు ఎగ్జిబిటర్లకు జమ చేసే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది.

ఇప్పుడున్న టికెటింగ్ యాప్స్ అన్నీ ఏ రోజుకు ఆ రోజు టికెట్ల డబ్బులన్నీ ఎగ్జిబిటర్లకు ఇచ్చేస్తున్నాయి. కానీ జగన్ సర్కారు ఈ విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. బిల్లులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ పెట్టుకుని ఏడిపిస్తారేమో, లంచాలు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఎగ్జిబిటర్లు టెన్షన్ పడుతున్నారు. అసలు ఇలా ప్రైవేటు బిజినెస్‌లో ప్రభుత్వ జోక్యం ఏంటి.. మాకు నచ్చిన మార్గంలో మేం టికెట్లు అమ్ముకుంటుంటే.. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ సర్కారు ఇలా అవసరం లేని వ్యవహారాల్లో ఎందుకు కెలుక్కుని అందరినీ ఇబ్బంది పెడుతోంది, జనాల్లో చెడ్డపేరు తెచ్చుకుంటోంది అన్నదే అర్థం కాని విషయం.

This post was last modified on June 21, 2022 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

4 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

10 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

12 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

14 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

16 hours ago