టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే కుటుంబం నుంచి రాలేదు. ఐతే వాళ్లలో మెజారిటీ సక్సెస్ కావడం, ఎక్కువగా బయటి బేనర్లలోనే అవకాశాలు సంపాదించడం, సొంత టాలెంట్తో నిలబడటం అభినందనీయం. ఆ ఫ్యామిలీ నుంచి చివరగా హీరోగా అరంగేట్రం చేసింది వైష్ణవ్ తేజ్.
అతను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో ‘ఉప్పెన’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తొలి సినిమాతో ఇంత పెద్ద హిట్ కొట్టాక కెరీర్కు ఢోకా ఏముంటుంది? రెండో సినిమాకే క్రిష్ లాంటి పెద్ద దర్శకుడితో ఆయన బేనర్లోనే నటించాడు వైష్ణవ్.
కానీ వీరి కలయికలో వచ్చిన ‘కొండపొలం’ అంచనాలను అందుకోలేకపోయింది. అయినా వైష్ణవ్ జోరేమీ తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ యువ కథానాయకుల్లో అత్యంత బిజీగా ఉన్న వాళ్లలో వైష్ణవ్ ఒకడు. అతడికి వరుసగా పెద్ద పెద్ద బేనర్లలోనే అవకాశాలు వస్తున్నాయి.
వైష్ణవ్ మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ను నిర్మిస్తున్నది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని ఈ సంస్థ ‘ఛత్రపతి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ చిత్రాలను నిర్మించడం తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈసారి అతను ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీతో జట్టు కడుతున్నాడు.
ఆయన బేనర్ సితార ఎంటర్టైన్మెంట్స్తో వైష్ణవ్ ఒకేసారి రెండు మూడు చిత్రాలకు ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ముందుగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో వైష్ణవ్ తేజ్ సినిమాను మొదలుపెడుతున్నారు. బుధవారమే ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా జరగనుంది.
‘పెళ్ళిసంద-డి’తో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన యువ కథానాయిక శ్రీ లీల ఈ చిత్రంలో వైష్ణవ్తో జోడీ కట్టబోతోంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ స్పీడైతే మామూలుగా లేదు. ఇలా ఒక కొత్త హీరో కెరీర్ ఆరంభంలో వరుసగా మైత్రీ, ఎస్వీసీసీ, సితార లాంటి పెద్ద బేనర్లలో సినిమాలు చేయడం విశేషమే.
This post was last modified on June 21, 2022 11:40 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…