టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే కుటుంబం నుంచి రాలేదు. ఐతే వాళ్లలో మెజారిటీ సక్సెస్ కావడం, ఎక్కువగా బయటి బేనర్లలోనే అవకాశాలు సంపాదించడం, సొంత టాలెంట్తో నిలబడటం అభినందనీయం. ఆ ఫ్యామిలీ నుంచి చివరగా హీరోగా అరంగేట్రం చేసింది వైష్ణవ్ తేజ్.
అతను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో ‘ఉప్పెన’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తొలి సినిమాతో ఇంత పెద్ద హిట్ కొట్టాక కెరీర్కు ఢోకా ఏముంటుంది? రెండో సినిమాకే క్రిష్ లాంటి పెద్ద దర్శకుడితో ఆయన బేనర్లోనే నటించాడు వైష్ణవ్.
కానీ వీరి కలయికలో వచ్చిన ‘కొండపొలం’ అంచనాలను అందుకోలేకపోయింది. అయినా వైష్ణవ్ జోరేమీ తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ యువ కథానాయకుల్లో అత్యంత బిజీగా ఉన్న వాళ్లలో వైష్ణవ్ ఒకడు. అతడికి వరుసగా పెద్ద పెద్ద బేనర్లలోనే అవకాశాలు వస్తున్నాయి.
వైష్ణవ్ మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ను నిర్మిస్తున్నది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని ఈ సంస్థ ‘ఛత్రపతి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ చిత్రాలను నిర్మించడం తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈసారి అతను ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీతో జట్టు కడుతున్నాడు.
ఆయన బేనర్ సితార ఎంటర్టైన్మెంట్స్తో వైష్ణవ్ ఒకేసారి రెండు మూడు చిత్రాలకు ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ముందుగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో వైష్ణవ్ తేజ్ సినిమాను మొదలుపెడుతున్నారు. బుధవారమే ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా జరగనుంది.
‘పెళ్ళిసంద-డి’తో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన యువ కథానాయిక శ్రీ లీల ఈ చిత్రంలో వైష్ణవ్తో జోడీ కట్టబోతోంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ స్పీడైతే మామూలుగా లేదు. ఇలా ఒక కొత్త హీరో కెరీర్ ఆరంభంలో వరుసగా మైత్రీ, ఎస్వీసీసీ, సితార లాంటి పెద్ద బేనర్లలో సినిమాలు చేయడం విశేషమే.
This post was last modified on June 21, 2022 11:40 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…