Movie News

నాగ్‌ సినిమాకు ఇద్దరు దర్శకులు?

అక్కినేని నాగార్జునతో పాటు అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ ప్రధాన పాత్రలో గత ఏడాది తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ పేరుతో ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కొన్నాళ్లు షూటింగ్ జరిపాక బడ్జెట్, ఇంకేవో సమస్యలతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థ థెండ్రాల్ ఫిలిమ్స్ ఆర్థిక సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్లే సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి.

కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి.

ఐతే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద మార్పు చోటు చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ‘నాన్ రుద్రన్’ చిత్రానికి ధనుష్‌తో పాటు అతడి అన్న సెల్వ రాఘవన్ కూడా దర్శకత్వం వహించనున్నాడట. 600 ఏళ్ల కిందటి నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘యుగానికి ఒక్కడు’ తరహాలో కొన్ని ఎపిసోడ్లు ఉంటాయట. వాటిని తాను డీల్ చేయలేనని, సెల్వ అయితే బాగుంటుందని అన్నను అడగ్గా.. అతను అంగీకరించినట్లు సమాచారం.

ఒక సినిమాకు మధ్యలో దర్శకుడు మారడం మామూలే కానీ.. ఇలా అప్పటికే సినిమా తీస్తున్న దర్శకుడి అంగీకారంతో మరో దర్శకుడు ఎంటరవడం మాత్రం ఇదే తొలిసారి కావచ్చు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమాను డైరెక్ట్ చేయడం కూడా అరుదైన విషయమే. విశేషం ఏంటంటే నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్.

ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈసారి ధనుష్ ఓ భారీ ప్రయత్నమే చేస్తున్నాడు.

This post was last modified on June 28, 2020 1:39 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago