Movie News

నాగ్‌ సినిమాకు ఇద్దరు దర్శకులు?

అక్కినేని నాగార్జునతో పాటు అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ ప్రధాన పాత్రలో గత ఏడాది తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’ పేరుతో ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

కొన్నాళ్లు షూటింగ్ జరిపాక బడ్జెట్, ఇంకేవో సమస్యలతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థ థెండ్రాల్ ఫిలిమ్స్ ఆర్థిక సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్లే సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి.

కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఈ మధ్యే వార్తలొచ్చాయి.

ఐతే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద మార్పు చోటు చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ‘నాన్ రుద్రన్’ చిత్రానికి ధనుష్‌తో పాటు అతడి అన్న సెల్వ రాఘవన్ కూడా దర్శకత్వం వహించనున్నాడట. 600 ఏళ్ల కిందటి నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘యుగానికి ఒక్కడు’ తరహాలో కొన్ని ఎపిసోడ్లు ఉంటాయట. వాటిని తాను డీల్ చేయలేనని, సెల్వ అయితే బాగుంటుందని అన్నను అడగ్గా.. అతను అంగీకరించినట్లు సమాచారం.

ఒక సినిమాకు మధ్యలో దర్శకుడు మారడం మామూలే కానీ.. ఇలా అప్పటికే సినిమా తీస్తున్న దర్శకుడి అంగీకారంతో మరో దర్శకుడు ఎంటరవడం మాత్రం ఇదే తొలిసారి కావచ్చు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమాను డైరెక్ట్ చేయడం కూడా అరుదైన విషయమే. విశేషం ఏంటంటే నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్.

ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈసారి ధనుష్ ఓ భారీ ప్రయత్నమే చేస్తున్నాడు.

This post was last modified on June 28, 2020 1:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago