ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎంతమంచివాడవురా’ సినిమాతో పలకరించాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలే అతడి కెరీర్ అంతంతమాత్రంగా సాగుతుంటే.. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్నందించి కెరీర్ను మరింతగా దెబ్బ తీసింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఇదొకటని చెప్పొచ్చు.
ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ బ్రేక్ తీసుకున్నాడు. కొత్త సినిమా ఏదీ ఖరారు చేయలేదు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అన్నారు కానీ.. దాని సంగతి ఏమీ తేలలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తనలాగే జనవరి నెలలో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో పని చేయబోతుండటం విశేషం. ఆ దర్శకుడు మరెవరోకాదు.. వీఐ ఆనంద్. అతడి చివరి సినిమా ‘డిస్కో రాజా’.. సంక్రాంతి తర్వాత రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది.
కొన్నేళ్ల కిందట ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో భారీ విజయాన్నందుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత తీసిన ‘ఒక్కక్షణం’, ‘డిస్కో రాజా’ కూడా భిన్నమైన కథలతో తెరకెక్కినవే. కానీ వాటి ఎగ్జిక్యూషన్ సరిగా లేక బోల్తా కొట్టాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం మరో భిన్నమైన కథనే రెడీ చేశాడట ఆనంద్. కమర్షియల్గా కూడా వర్కవుటయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని.. ఇద్దరూ కలిసి ఓ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట.
ఈ చిత్రానికి నిర్మాత ఎవరో ఇంకా వెల్లడి కాలేదు. వేరే ప్రొడ్యూసర్ దొరక్కపోతే కళ్యాణ్ రామే నిర్మించే అవకాశముంది. మరోవైపు కళ్యాణ్ రామ్.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంటే ముందే ఆనంద్ దర్శకత్వంలో తన సినిమాను కళ్యాణ్ రామ్ మొదలుపెట్టే అవకాశముంది.
This post was last modified on June 28, 2020 9:38 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…