ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్లలో సురేష్ బాబు ఒకరు. సినిమాల నిర్మాణం, పంపిణీ, రిలీజ్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. కథల ఎంపిక దగ్గర్నుంచి సినిమాల ఫలితం వరకు ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉందని అంతా చెప్పుకుంటారు.
ఈ రోజుల్లో నిర్మాణం చాలా రిస్కీగా మారిన నేపథ్యంలో పెద్ద బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకుండా.. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల్లో భాగస్వామి అవుతుండటం, అందులోనూ పూర్తిగా పెట్టుబడి పెట్టకుండా, కొంత మేరే వాటా తీసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతుండటం గమనించవచ్చు.
‘విరాటపర్వం’ విషయంలోనూ ఆయన అలాగే చేశారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడు మాత్రమే. ఖర్చంతా పెట్టుకుంది సుధాకర్ చెరుకూరినే. ఐతే బిజినెస్ మొత్తం సురేష్ బాబు చేతుల మీదుగానే జరిగింది. ఐతే కరోనాకు ముందు మొదలైన ‘విరాటపర్వం’ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే.
దీంతో పాటే సురేష్ బాబు వెంకటేష్తో తీసిన నారప్ప, దృశ్యం-2 చిత్రాలను తీవ్ర వ్యతిరేకత మధ్య థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేయడం తెలిసిందే. ఆ రెండు చిత్రాలను మంచి లాభానికే ఓటీటీలకు ఇచ్చారు సురేష్ బాబు. ఒక దశలో ‘విరాటపర్వం’ సినిమాకు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందని, థియేట్రికల్ రిలీజ్ ఉండదని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రమోట్ చేసి ఈ శుక్రవారం విడుదల చేశారు. సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఇది నెమ్మదిగా సాగే సీరియస్ మూవీ, పైగా విషాదాంతం కావడంతో ఎక్కువగా వినోదం కోసమే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు దీన్ని అనుకున్నంత స్థాయిలో ఆదరించట్లేదు.
తొలి వీకెండ్లోనే కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం కొంత వరకు సినిమా హోల్డ్ చేయొచ్చు కానీ.. వీకెండ్ తర్వాత నిలబడ్డం చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ చూస్తుంటే.. థియేట్రికల్ రిలీజ్ ఎందుకు చేశారు, దీని బదులు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే మంచి లాభాలు వచ్చి ఉండేవి కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సురేష్ బాబు తప్పటడుగు వేశాడని అంటున్నారంతా.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…