ఈ మధ్య వచ్చిన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు చూస్తుంటే అంతుచిక్కని విషయాలు బయటపడుతున్నాయి. అంటే సుందరానికి అందరూ బాగానే ఉందన్నారు. తీరా చూస్తే ఇంకా బ్రేక్ ఈవెన్ కి చెప్పుకోదగ్గ దూరంలోనే ఉంది. మూడో వారంలో ఏదైనా అద్భుతం జరగడానికి ఇది శంకరాభరణం కాలం కాదు.
మొన్న వచ్చిన విరాట పర్వంని క్రిటిక్స్ మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ పొగడ్తలు కనిపించాయి. కానీ థియేటర్ల వద్ద సగం జనం కూడా లేరు. వీకెండ్ ఇలా అయితే ఇక రేపటి నుంచి ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. సర్కారు వారి పాట మహేష్ ఇమేజ్ వల్ల నష్టాలు తగ్గించుకుంది కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది.
ఎఫ్3 ఆదరణ బాగానే ఉంది కానీ ఎఫ్2 స్థాయి దూకుడు చూపించలేదన్నది వాస్తవం. అపోజిషన్ వీక్ గా ఉండి ప్రయోజనం ఎక్కువ కలిగింది. లేదంటే దీని పరిస్థితి కూడా ఇబ్బందే. ఈ పరిణామాలు గమనిస్తే ప్రేక్షకులు మారారా లేక దర్శకులు అప్ డేట్ కావడం లేదానే అనుమానం కలగడం సహజం.
కాకపోతే కరోనా తర్వాత ఆడియన్స్ అభిరుచుల్లో ప్రాక్టికల్ గా వచ్చిన మార్పులను ఇండస్ట్రీ పసిగట్టలేకపోవడం వల్ల వచ్చిన చిక్కే ఇది. కేవలం ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లే ఈ పరిస్థితి కారణం కాదు. పెరిగిన టికెట్ రేట్లు, ఓటిటిలో అంతకంతా పెరుగుతున్న క్వాలిటీ కంటెంట్ వల్ల సినిమా హాల్ కు రావాలంటే పబ్లిక్ బలమైన కారణం కోరుతున్నారు.
దానికి తగ్గట్టే ఇకపై దర్శకులు రచయితలు సిద్ధపడాల్సి ఉంటుంది. అంతే తప్ప హీరో మెచ్చాడనో పర్సనల్ గా డైరెక్టర్ కు ఫలానా భావజాలం ఇష్టమనో సినిమాలు తీస్తే పైన చెప్పిన సీన్ రిపీట్ అవ్వడం ఖాయం.
విక్రమ్ మనవాళ్ళు కూడా ఎందుకు ఎగబడి చూశారో విశ్లేషించుకోవడం చాలా అవసరం. వచ్చే గురు శుక్రవారాల్లో ఏకంగా తొమ్మిది సినిమాలు వస్తున్నాయి. కానీ ట్రేడ్ లో ఉండాల్సిన జోష్ కనిపించడం లేదు. జురాసిక్ పార్క్ లు, థోర్ లు నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పెడితే టికెట్లు కొంటున్న జనంలో మన సినిమాల పట్ల ఎందుకు ఆసక్తి సన్నగిల్లుతోందో సీరియస్ గా ఆలోచించాలి. లేదంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదు.
This post was last modified on June 19, 2022 2:40 pm
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…