Movie News

శ్రీదేవి కూతురి బ్యాడ్ ప్లానింగ్

ఒకప్పుడు తెలుగులోనే కాదు ఇండియా వైడ్ పాపులారిటీలో శ్రీదేవిని మించినవారు లేరు. ఏఎన్ఆర్ తో స్టెప్పులు వేయాలన్నా వాళ్ళబ్బాయి నాగార్జునతో ఆడిపాడాలన్నా ఆమెకే చెల్లింది. చిరంజీవి అంతటి మెగాస్టార్ కే అతిలోకసుందరి జోడిగా నటించడానికి పదేళ్లు పట్టింది. ఇక హిందీ గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ మీద మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. ఫ్యాన్స్ జూనియర్ శ్రీదేవిగా పిలుచుకున్నారు.

కానీ తీరా ఆ అమ్మాయి కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే స్క్రీన్ కంటే ఓటిటిలో ఎక్కువ కనిపించేలా ఉంది. 2108 ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ ఐదేళ్లలో చేసిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో గుంజన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్ డైరెక్ట్ డిజిటల్ లో వచ్చేశాయి. నయనతార కోకో కోకిల రీమేక్ గుడ్ లక్ జెర్రీ కూడా థియేటర్లకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. మరో మళయాలం మూవీ హెలెన్ ని జాన్వీ మిలిగా చేసింది. ఇది ఎందులో వస్తుందో ఇంకా తెలియదు. ఎప్పుడో నవంబర్ లో పూర్తి చేస్తే ఇప్పటిదాకా రిలీజ్ అప్డేట్ లేదు.

ఇవి కాకుండా చేతిలో ఉన్న రెండు సినిమాలు మిస్టర్ అండ్ మిసెస్ మహీ, బవాల్. అంతే. నిజానికి గతంలో తనకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వెళ్లాయి. దిల్ రాజు, పూరి లాంటి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ తండ్రి బోనీ కపూర్ ఏదేదో అంచనా వేసుకుని ఇక్కడ లాంచ్ చేయడం వాయిదా వేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడామె మీద మనోళ్లకు ఆసక్తి తగ్గిపోయింది. అక్కడ చూస్తేనేమో అధిక శాతం రీమేకులు, ఓటిటి రిలీజులతో ప్లానింగ్ ఎగుడుదిగుడుగా మారింది. చూస్తుంటే శ్రీదేవి వారసత్వం నిలబెట్టడం కష్టమే అనిపిస్తోంది

This post was last modified on June 19, 2022 12:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

7 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

8 hours ago