సౌత్ సినిమా జెండా నార్త్లో రెపరెపలాడటానికి పరోక్షంగా బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక కారణం. బాహుబలి సినిమాను హిందీలో తన బేనర్ ద్వారా కరణ్ రిలీజ్ చేయడం వల్లే దానికంత రీచ్ వచ్చింది. ఆ సినిమాను చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం, దానికి బాలీవుడ్ సెలబ్రెటీల మద్దతు దక్కేలా చూడడంలో కరణ్ పాత్ర కీలకం.
ఐతే బాహుబలి బాలీవుడ్ మార్కెట్ మీద పరోక్షంగా ప్రతికూల ప్రభావం చూపింది. జనాలు సౌత్ సినిమాలకు రుచి మరిగారు. కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాలతో ఈ ఒరవడి బాగా పెరిగి బాలీవుడ్ సినిమాల అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఈ విషయంలో కరణ్ జోహార్ను నిందించేవాళ్లు కూడా ఉన్నారు బాలీవుడ్లో. ఐతే కరణ్ మాత్రం అప్పుడు, ఇప్పుడు సౌత్ సినిమాలను పొగుడుతూనే ఉన్నాడు. సౌత్ చిత్రాలను చూసి నేర్చుకోవాలని, సినిమాలు తీసే విషయంలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ పునరాలోచించాలని కూడా అతను సూచిస్తుంటాడు.
తాజాగా కరణ్ జోహార్ ఉత్తరాదిన సౌత్ సినిమాల జోరు గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కథలను ఎంచుకోవడంలో, సినిమాలు తీయడంలో దక్షిణాది దర్శకులకు ఉన్న కన్విక్షన్ గొప్పదని, అది బాలీవుడ్ ఫిలిం మేకర్స్లో లోపిస్తున్నట్లుగా అనిపిస్తోందని కరణ్ వ్యాఖ్యానించాడు. ఒకే సినిమాలో చాలా చెప్పాలనుకుని తమ దర్శకులు కన్ఫ్యూజ్ అవుతుంటారని.. కానీ దక్షిణాది డైరెక్టర్లు తాము ఏం చెప్పాలనుకున్నామో, చూపించాలనుకున్నామో అది ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం, చూపించడం ద్వారా విజయవంతం అవుతున్నారని కరణ్ అన్నాడు.
ఇటీవల తాను కేజీఎఫ్-2 చూశానని.. అది తనకు బాగా నచ్చిందని.. కానీ అదే సినిమా బాలీవుడ్లో తీసి ఉంటే ఎన్నో ఇబ్బందులు వచ్చేవని.. విమర్శలతో తమను చంపేసేవారని కరణ్ వ్యాఖ్యానించడం విశేషం. కేజీఎఫ్-2 హిందీలో రూ.450 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…