వసూళ్ల లెక్కలో కెజిఎఫ్ 2 మన ఆర్ఆర్ఆర్ ని దాటిందన్నది వాస్తవమే. తేడా వంద కోట్లే అయినప్పటికీ రాజమౌళి మూవీని మూడో సినిమాకే ప్రశాంత్ నీల్ దాటేయడం విశేషమే. అయితే ఇలా లెక్కల్లో కెజిఎఫ్ గెలిచిన మాట నిజమే కానీ అంతర్జాతీయ గుర్తింపులో మాత్రం ట్రిపులార్ ని కనీసం టచ్ కూడా చేయలేకపోయింది.
ఇండియా, ఓవర్సీస్ లో థియేట్రికల్ రన్ పూర్తయ్యాక యుఎస్ లో ఎన్కోర్ పేరుతో ఆర్ఆర్ఆర్ ని రీ రిలీజ్ చేసి ప్రీమియర్లు వేస్తే దాదాపు అన్ని స్క్రీన్లు హౌస్ ఫుల్ బోర్డ్స్, నాన్ ఇండియన్స్ తో కళకళలడాయి.
అక్కడితో కథ అయిపోలేదు. రాటెన్ టొమాటోస్ లో రిజిస్టర్ అయిన తొలి సౌత్ మూవీగా మరో ఘనత అందుకుంది. హాలీవుడ్ సినిమాలు, ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు రోజు ట్వీట్లు వేసి మరీ ఈ విజువల్ గ్రాండియర్ ని చూసిన ఆనందాన్ని పంచుకుంటున్నారు.
వీళ్లంతా స్వచ్చందంగా హిందీ వెర్షన్ ని సబ్ టైటిల్స్ సహాయంతో చూసినవాళ్ళే. 1 మిలియన్ ఫాలోయర్లు ఉన్న సుప్రసిద్ధ గేమ్ డిజైనర్ కొజిమా హిడియో ఆర్ఆర్ఆర్ గురించి ట్వీట్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది
చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి కానీ కెజిఎఫ్ 2కి ఇలాంటి గుర్తింపు ఓటిటిలో వచ్చాక రాలేదన్నది వాస్తవం. అమెజాన్ ప్రైమ్ ఎంత ప్రమోషన్ చేస్తున్నా అది ఇండియా వరకే పరిమితమవుతోంది.
ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే కెజిఎఫ్ 2లో ఉన్న హీరోయిజం ఎలివేషన్లు ఎక్కువే అయినప్పటికీ విదేశీయులకు అది కనెక్ట్ కావడం లేదు. జక్కన్న మాయాజాలం ముందు ఇంకేదీ ఎక్కడం లేదు. మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ లో కెజిఎఫ్ 2 మీద ఆర్ఆర్ఆర్ పూర్తిగా పైచేయి సాధించిన మాట వాస్తవం.
This post was last modified on June 18, 2022 8:54 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…